T20 World cup: సెమీస్కు ముందు టీమిండియాకు షాక్.. రోహిత్కు గాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World cup: టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్లో ఐదు మ్యాచ్లకు గానూ నాలుగింటిని గెలిచి టీమిండియా సెమీస్కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న ఇంగ్లండ్ జట్టుతో సెమీస్ ఆడనుంది భారత్. ఈ నేపథ్యంలో భారత క్రీడాకారులు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నెట్స్లో సాధన ఆరంభించగా.. ప్రాక్టీస్ సమయంలో రోహిత్ ముంజేయికి గాయమైనట్లు తెలుస్తోంది. షాట్ ఆడే క్రమంలో అతడి కుడి ముంజేతికి బంతి తగిలినట్లు తెలుస్తోంది. దీంతో హిట్మ్యాన్ ఇబ్బందికి గురికాగా.. వెంటనే స్పందించిన సిబ్బంది అతడికి చికిత్స అందించింది. దీంతో కొద్దిసేపు రోహిత్ బ్యాట్ను వదిలి వెళ్లిపోయాడు. అయితే రోహిత్ తీవ్రంగా గాయపడ్డాడేమోనని ప్రాక్టీస్ చూసేందుకు వచ్చిన క్రీడాభిమానులు భయాందోళనకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న రోహిత్.. చికిత్స అనంతరం తిరిగి బ్యాట్ పట్టడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఏ నొప్పి లేకుండా బ్యాటింగ్ చేసిన రోహిత్.. మళ్లీ నొప్పి తిరగబడితే మాత్రం సెమీస్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి రావద్దని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Sukesh Chandrashekar: ఆప్పై సీబీఐ విచారణ జరిపించాలి.. సుఖేష్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఇదిలా ఉండగా.. సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడేందుకు టీమిండియా అడిలైడ్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దృష్టంతా ఇంగ్లండ్తో గురువారం జరిగే మ్యాచ్పైనే ఉంది. ఈ పోరుకు వేదిక అడిలైడ్ వేదిక కానుండడం భారత్కు సానుకూలాంశం కానుంది. ఎందుకంటే.. భారత్ ఇప్పటికే ఇక్కడ ఓ మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్తో జరిగిన వర్షప్రభావిత మ్యాచ్లో ఐదు పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఇక్కడి పరిస్థితులపై ఇంగ్లండ్ కన్నా భారత ఆటగాళ్లకే ఎక్కువ అవగాహన ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ఇంగ్లాండ్ జట్టు ఈ టోర్నీలో బ్రిస్బేన్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీలలోనే బరిలోకి దిగింది. అయితే పొట్టి ఫార్మాట్లో గత రికార్డులకు పెద్దగా ప్రాధాన్యం ఉండని విషయం తెలిసిందే. ఆ రోజున ఎవరు, ఎలా ఆధిపత్యం ప్రదర్శిస్తారనే దానిపైనే ఫైనల్కు వెళ్లగలమా? లేదా? అనేది నిర్ణయమవుతుంది. ఈ విషయం భారత జట్టుకు కూడా తెలుసు కాబట్టి.. జాగ్రత్తగా ఆడి తుది పోరుకు చేరాలనుకుంటోంది టీమిండియా. ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!