Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Indonesia Trishul Project 125 Billion Defense Plan

Indonesia Trishul Project: త్రిశూల్ ప్రాజెక్టుకు అతిపెద్ద ముస్లిం దేశం ప్లాన్..

Published Date :November 11, 2025 , 7:41 pm
By Shiva Ganesh
Indonesia Trishul Project: త్రిశూల్ ప్రాజెక్టుకు అతిపెద్ద ముస్లిం దేశం ప్లాన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Indonesia Trishul Project: ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఈక్రమంలో ఇండోనేషియా త్రిశూల్ అనే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశాన్ని దాడుల నుంచి రక్షించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఇండోనేషియా దేశ రక్షణ వ్యవస్థ కోసం త్రిశూల్ అనే రక్షణ కవచాన్ని అభివృద్ధి చేస్తోంది పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇండోనేషియా తన త్రిశూల్ రక్షణ వ్యవస్థ కోసం సుమారు $125 బిలియన్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతోందని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారని ఈ నివేదికలు స్పష్టం చేశాయి.

READ ALSO: CM Chandrababu Naidu: కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు అంశాలపై చర్చలు..!

త్రిశూల్ రక్ష కవచం అంటే..
ఇండోనేషియా ప్రభుత్వం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని యోచిస్తుంది. ప్రస్తుత రాజధాని జకార్తాను నుసంతారాకు మార్చడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వం నుసంతారాలో త్రిశూల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రణాళిక ఇండోనేషియా కొత్త రాజధానిని బాహ్య దాడుల నుంచి కాపాడుతుందని ప్రభుత్వం తెలిపింది. త్రిశూల్ ప్రణాళిక కింద ఇండోనేషియా ప్రభుత్వం జలాంతర్గాములు, యుద్ధనౌకలు, క్షిపణి సాయుధ వేగవంతమైన దాడి నౌకలు, దీర్ఘ-శ్రేణి క్షిపణులు వంటి కొత్త పరికరాలను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రణాళిక కింద కొత్త సైనికులను నియమించుకోవడానికి ప్రభుత్వం నిబంధనలను కూడా చేర్చింది.

IISS నివేదిక ప్రకారం.. ఇండోనేషియా త్రిశూల్ ప్రణాళిక కింద రెండు సెకండ్ హ్యాండ్ డస్సాల్ట్ మిరాజ్ 2000-D/ED ఫైటర్ జెట్‌లను, 24 బోయింగ్ F-15EX ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేసింది. వీటిని త్వరలో ఇండోనేషియాలో మోహరించనున్నారు. అదేవిధంగా ఇండోనేషియా 24 లాక్‌హీడ్ మార్టిన్ S-70M బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, రెండు ఎయిర్‌బస్ A400M అట్లాస్ ఎయిర్‌లిఫ్టర్లు, 12 టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అంకా మీడియం-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ అన్ ఇన్హమేటెడ్ ఏరియల్ వెహికల్స్ (UAVలు) కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ దేశం ఎక్కువగా తన ఆయుధాలను ఎక్కువగా అమెరికా లేదా చైనా నుంచి కొనుగోలు చేస్తుంది, వీటిలో అమెరికా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు, చైనా నుంచి చౌకైన, తేలికైన ఆయుధాలు ఉన్నాయి.

ఆయుధాలను ఎందుకు కొనుగోలు చేస్తోంది..
ఇండోనేషియా ఇన్ని ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందనే అనుమానం అందరికి రావచ్చు. వాస్తవానికి ఈ దేశానికి మలేషియా, ఆస్ట్రేలియాతో చిన్న చిన్న ఘర్షణలు ఉన్నాయి. అయితే ఇవి చిన్న చిన్న ఘర్షణలు మాత్రమే. ముస్లిం మెజారిటీ కలిగిన ఇండోనేషియా దేశానికి పైన పేర్కొన్న దేశాలతో తప్ప ప్రస్తుతం వేరే దేశాలతో ఘర్షణ వాతావరణం లేదు. దీనివల్ల ఇండోనేషియా కొత్త ఆయుధాలను ఎందుకు ఇంత వేగంగా కొనుగోలు చేస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది. నిజానికి మధ్య ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇండోనేషియాను ఆందోళనకు గురిచేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండోనేషియాలో 17 వేల కంటే ఎక్కువ దీవులు ఉన్నాయి. దీని వలన వాటి రక్షణ కష్టతరం అవుతుందని, అందుకే ఈ దేశం కొత్త రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రారంభించిందని అంటున్నారు.

READ ALSO: Faridabad University Raid: “టెర్రర్ క్లినిక్”.. హర్యానా ఆస్పత్రిలో జైషే లింకులు !

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Black Hawk helicopters Indonesia
  • F-15EX Indonesia
  • Indonesia $125 billion defense plan
  • Indonesia defense modernization
  • Indonesia military spending

తాజావార్తలు

  • Gold Rates Down: భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం..

  • Gas Cylinder: ఒక ఇంట్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉండాలి..? ఈ నిబంధనలు తెలియకపోతే జైలుకే..

  • Shivalik LGP Tanker: గుజరాత్ చేరుకున్న ఎల్‌పీజీ ట్యాంకర్.. తీరనున్న గ్యాస్ కష్టాలు

  • A.R. Rahman: ఇండియాలో అత్యధిక ఆస్కార్’లు పొందింది ఎవరో తెలుసా?

  • Induction safety: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా.. చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions