Rajnath Singh: భారత రాజ్యాంగాన్ని ఎప్పటికీ బీజేపీ మార్చదు.. సవరణలు చేస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు బీజేపీ రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నిస్తుండటంతో పాటు రాజ్యాంగ ప్రవేశికను తాము మార్చాలని చూస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ 1976లో భారత రాజ్యాంగ పీఠికలో మార్పులు చేశారు.. కానీ ఇప్పుడు అనవసరంగా భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- Kerala: "దీపం" వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
- Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
అయితే, అవసరమైనప్పుడు రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేసే అవకాశం ఉందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు దీన్ని ఇలా చాలా సార్లు చేశాయి.. కానీ పీఠికలో మార్పులు చేసే ప్రశ్న లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మార్పులు చేసి ఇప్పుడు మాపై నిందలు వేసేందుకు ట్రై చేస్తుంది.. బీజేపీ దాని గురించి ఆలోచించడం లేదని కేంద్రమంత్రి అన్నారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని చింపి పారేస్తుందని, పీఠిక నుంచి “లౌకికవాదం” అనే పదాన్ని తొలగిందని హస్తం పార్టీ నేతలు చేస్తున్న వ్యా్ఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
Read Also: T20 World Cup 2024: తొలి బ్యాచ్తో యూఎస్కు వెళ్లని విరాట్, హార్దిక్.. కారణం ఏంటంటే..?
ఇక, కుల ఆధారిత రిజర్వేషన్లను తొలగించే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. కేవలం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఎప్పటికీ ఇవ్వబోమన్నారు. రిజర్వేషన్ను ఎందుకు అంతం చేస్తాం.. ఈ దేశంలో ఓబీసీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలి.. కానీ ప్రతిపక్షాలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!