Indian Railways Pamban Bridge: 81 శాతం పూర్తయిన భారత్ తొలి వర్టికల్ సీ బ్రిడ్జి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశపు తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ పంబన్. ఈ బ్రిడ్జి త్వరితగతిన నిర్మాణం పూర్తిచేసుకుంటోంది. భారతదేశ ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలుపుతోంది పంబన్ వంతెన. దీని పనులు వేగంగా జరుగుతున్నాయని ఇండియన్ రైల్వేస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే 81 శాతం పని పూర్తయింది. పైలింగ్ వర్క్ లో భాగంగా మొత్తం 333 పైల్స్ పూర్తయ్యాయి. పైల్ క్యాప్ & సబ్ స్ట్రక్చర్ లో భాగంగా మొత్తం 101 పూర్తయ్యాయని రైల్వే ట్వీట్ చేసింది. అలాగే 99 గిర్డర్లలో 76 పూర్తయ్యాయని తెలిపింది.
దేశంలో కీలక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని పెంచడానికి రైల్వే శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కాశ్మీర్ తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో బ్రిడ్జిలు నిర్మిస్తోంది. ఈ వర్టికల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రైల్వే ద్వారా మరింత వేగవంతమయిన సేవలు అందించే అవకాశం వుంటుంది. పాసింజర్, గూడ్స్ రైళ్ళ వేగం పెంచుకోవచ్చు. ఈ బ్రిడ్జి కింద నుంచి షిప్ లు, స్టీమర్లు కూడా సులువుగా ప్రయాణించే వీలుంటుంది.
Also Read
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
పంబన్ ప్రాంతంలో పాత వంతెన గతంలోనే ప్రారంభించబడింది. అయితే, తాజాగా వర్టికల్ వంతెన నిర్మిస్తున్నారు. పంబన్ ద్వీపానికి, రామేశ్వరం పట్టణాన్ని ఇది కలుపుతుంది. భారతదేశంలోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన. ఇది శ్రీలంకకు భారత్ కు మధ్య గల పాక్ జలసంధిపై ఉంది. గతంలో వున్న రోడ్డు, రైలు వంతెన 1914 లో ప్రారంభించబడింది.ఈ వంతెన 2010 వరకు భారతదేశంలోని అన్ని వంతెనలలో పెద్దదిగా నిలిచింది. 2.3 కిలోమీటర్లు ఉన్న ఈ వంతెన నిర్మించి 2014 ఫిబ్రవరి 24 నాటికి వందేళ్ళు పూర్తైంది. పంబన్ లో వున్న రోడ్డు కం రైలు వంతెన 6,776 అడుగులు అంటే 2,065 మీటర్లు పొడవు కలిగి ఉంది. దీనిని 1914 లో ప్రారంభించారు. రైలు మార్గం వంతెన డబుల్-లీఫ్ బేస్కూల్ వంతెన. ఇది ఈ మార్గంలో బ్రిడ్జి కింద నుండి వచ్చే ఓడలకు దారినిచ్చేవిధంగా వెసులుబాటు ఉంటుంది.
India's 1st vertical lift Railway Sea Bridge- Pamban Bridge connecting the mainland of India with Rameswaram Island.
• 81% work completed
• Piling Work: All 333 piles completed
• Pile cap & Sub-Structure: All 101 completed
• 76 out of 99 girders launched pic.twitter.com/rJs3KG1SWd— Ministry of Railways (@RailMinIndia) October 25, 2022
తాజావార్తలు
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!