CPI Narayana: ముందస్తు ఎన్నికలు జరిపితే.. మోడీ ముందే ఇంటికి పోతాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అని లీక్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యనించారు. వన్ నేషన్, వన్ పార్టీ, వన్ పర్సన్.. ఆర్ఎస్ఎస్ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్పై అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాలని నారాయణ చెప్పారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్కు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం అక్కర్లేదు.. నా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే పద్దతికాదు.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ ప్రక్రియ అయినా నిర్వహించాలని సీపీఐ నారాయణ అన్నారు.
Read Also: Coffee Facts : ఒక నెల పాటు కాఫీని తాగకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
బీజేపీ పేరు మోసిన పెద్దవాళ్లను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. జమిలి ఎన్నికలపై చర్చ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు.. ఇండియా కూటమి బలపడకుండా ముందుగా తాము బయటపడాలని బీజేపీ చూస్తుందని ఆయన విమర్శించారు.”ఇండియా” కూటమి సమావేశంతో ప్రధాని మోడీ భయపడుతున్నారు.. ముందస్తు ఎన్నికలు జరిపితే, ముందే మోడీ ఇంటికి పోవడం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Supreme court: ” చెల్లని వివాహాల” ద్వారా పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుంది..
జీ-20 సమావేశాల పేరుతో “కమలం” గుర్తును కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నారు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చంద్రమండంలో రోవర్ లాండ్ అయిన ప్రదేశానికి “శివశక్తి” అని పేరు పెట్టారు.. ఈ రకంగా వీలైన చోటల్లా మతాన్ని జోడించే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇష్టానుసారంగా పేర్లు పెట్టుకోడానికి మన దేశం కాదు చంద్ర మండలం అని ఆయన చెప్పారు. వీలైన చోటల్లా మతాన్ని జోడించి బీజేపీ రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు.. “ఒకే భాష, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే లీడర్” అన్నది వాళ్ల సిద్ధాంతమే అని సీపీఐ నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
-
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!