Karnataka Ministers: కర్ణాటక మంత్రులకు అత్యాధునిక కార్లు.. 33 కార్ల కొనుగోలుకు సర్కార్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Ministers: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్డీ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ప్రభుత్వాలు మారిన తరువాత వచ్చే కొత్త ప్రభుత్వాలు మంత్రులు, ముఖ్యమంత్రుల వాహనాలను మార్చుకోవడం సర్వసాధారణం. ఇపుడు కర్ణాటకలో కూడా బీజేపీ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున మంత్రులందరికీ కొత్తగా కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్లో ఉన్న 33 మందికి కొత్త కార్లను కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నిధులను సైతం కేటాయించింది. అత్యాధునికమైన కొత్త కార్లను కొనుగోలు చేయనుంది.
Read Also: Riti Saha Case: విద్యార్థిని రీతి సాహ కేసులో కొత్త ట్విస్ట్.. ఏపీ కోర్టుకు తండ్రి సుఖదేవ్
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
- PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
- Supreme Court: 'గుడ్లకు భయమెందుకు?'.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
కర్ణాటక రాష్ట్ర మంత్రులు కొత్త హై-ఎండ్ హైబ్రిడ్ కార్లను అందుకోనున్నారు. ఒక్కో మంత్రికి ఒకటి చొప్పున 33 కార్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9.9 కోట్లు కేటాయించింది.
ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్తో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా ఇథనాల్తో నడిచే కారు అయిన టయోటా నుండి ఇటీవల విడుదల చేసిన హైబ్రిడ్ హైక్రాస్ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ప్రముఖ ఎమ్పివి ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్ను సంస్థ ఆగస్ట్ 29న అధికారికంగా విడుదల చేసింది. ఒక్కో కారు ఖరీదు రూ.30 లక్షలు. ప్రభుత్వం టయోటా కిర్లోస్కర్ నుండి నేరుగా కార్లను కొనుగోలు చేయనుంది. ప్రత్యక్ష కొనుగోలును సులభతరం చేయడానికి, వారు 4(G) మినహాయింపును మంజూరు చేశారు. అయితే మంత్రుల కోసం హైబ్రిడ్ కార్లపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై బిజెపి విమర్శలు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని భావిస్తున్నానని.. రాష్ట్రం ఆర్థిక, ప్రకృతి వైపరీత్యాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. కాబట్టి ఇలాంటి ఆర్థికపరమైన భారాలుపడే నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించాలన్నారు. కార్ల కొనుగోలుకు ఉపయోగించే సొమ్మును ప్రజల సంక్షేమానికి వినియోగించాలని.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్నా ప్రజలను పట్టించుకోవడం లేదని.. ఇవన్నీ ఫ్యాషన్గా మారిపోయాయని విమర్శించారు.
తాజావార్తలు
-
Varun Tej : ‘ఎన్టీఆర్ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్పై వరుణ్ తేజ్ క్లారిటీ..
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
-
Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!