Indians Spending 30 minutes time on memes
మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రోజు రోజుకూ మీమ్స్ వాడకం ఎక్కువుతోంది. తక్కువసమయంలోనే మీమ్స్ వాడకం పెరుగుతూ వస్తోంది. అయితే.. తాజాగా.. భారతీయ స్మార్ట్ఫోన్ వినియోగదారులు రోజుకు 30 నిమిషాలు మీమ్ల వినియోగంపై గడుపుతున్నారని, గత సంవత్సరంలో 80 శాతం మంది మీమ్ వినియోగాన్ని పెంచుకున్నారని కొత్త నివేదిక సోమవారం వెల్లడించింది. స్ట్రాటజీ కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ నివేదిక ప్రకారం.. చాలా మంది వినియోగదారులు మీమ్లను ఒత్తిడి నుంచి బయట పడేందుకు మంచి మార్గంగా ఆస్వాదిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. అయితే.. “మీమ్ల భాగస్వామ్యత వాటిని ఒకే ఆసక్తి ఉన్న సమూహాలలో లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాదరణ పొందింది, ఎందుకంటే చాలా మంది వ్యక్తులు వాటిని సాపేక్షంగా భావిస్తారు. ఈ విధంగా, గత సంవత్సరంలోనే దాదాపు 80 శాతం మంది మీమ్ వినియోగాన్ని పెంచుకోవడంలో ఆశ్చర్యం లేదు” అని రెడ్సీర్ ప్రతినిధి మృగాంక్ గుట్గుటియా అన్నారు.
ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇప్పుడు మీమ్స్ పీక్లో ఉన్నాయి. ఈ పెరుగుతున్న డిమాండ్ను కొనసాగించడానికి, మీమ్స్ క్రియేషన్ ప్లాట్ఫారమ్లు మార్కెట్లో డిమాండ్ ఉంది. “తొంభై శాతం మంది వినియోగదారులు మీమ్లను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారు, దీన్ని బట్టి మీమ్ క్రియేషన్ యాప్లకు డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు ” అని గుట్గుటియా అన్నారు. ప్రజలు బ్రాండ్ బిల్డింగ్ కోసం మరియు సృజనాత్మక అవుట్లెట్గా మీమ్లను వినియోగించాలని లేదా సృష్టించాలని కోరుకుంటారు. “తక్కువ వ్యవధిలో మీమ్లు ఇంత పెద్ద ప్రజాదరణ పొందేలా చేసే ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా వాటికి కనెక్ట్ చేయగలడు – మరియు ఇది బ్రాండ్ బిల్డింగ్ మరియు మార్కెటింగ్కి గొప్పగా పనిచేస్తుంది” అని నివేదిక వెల్లడించారు.