అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీషా కందుల(23) క్షేమంగా ఉన్నట్లు యూఎస్ పోలీసులు తెలిపారు. మే 28న నితీషా అదృశ్యమైంది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలోని శాన్ బెర్నార్డినోలో ఆమె మాస్టర్స్చేస్తోంది. ఆమె ఆచూకీ కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Chandrababu – Pawan: పవన్తో చంద్రబాబు భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు..!
నితీషా చివరిసారిగా లాస్ ఏంజిలిస్లో టయోటా కారు నడుపుతూ కనిపించిందని సీఎస్యూఎస్బీ పోలీసులు వెల్లడించారు. ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ట్వీట్చేశారు. ఇదిలా ఉండగా.. గత నెల 26 ఏండ్ల రూపేశ్ చంద్ర చింతకింది అనే ఇండియన్ స్టూడెంట్ షికాగోలో తప్పిపోయాడు. అలాగే ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్లోని నాచారానికి చెందిన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫత్(25) అదృశ్యమయ్యాడు. కొన్నిరోజుల తర్వాత అర్ఫత్ మృతదేహాన్ని పోలీసులు క్లీవ్లాండ్లో గుర్తించారు. మాస్టర్స్ చేసేందుకు గతేడాది మేలో అర్ఫత్ అమెరికా వెళ్లాడు. క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీలో చేరి చదువుకుంటున్నాడు. మార్చిలో భారత్ కు చెందిన 34 ఏండ్ల క్లాసికల్ డ్యాన్సర్ అమర్నాథ్ ఘోష్ మిస్సౌరీలోని సెయింట్ లూయీలో హత్యకు గురయ్యాడు.
ఇది కూడా చదవండి: Ponguleti: బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వడంతోనే బీజేపీకి సీట్లొచ్చాయి