America: కసాయి తల్లి.. కొడుకు గొంతు కోసి చంపిన భారత సంతతికి చెందిన మహిళ
- కొడుకు గొంతు కోసి చంపిన భారత సంతతికి చెందిన మహిళ
- పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు
- ఆ మహిళను 48 ఏళ్ల సరితా రామరాజుగా గుర్తించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని శాంటా అనాలో భారత సంతతికి చెందిన మహిళ తన 11 ఏళ్ల కొడుకును గొంతుకోసం చంపింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ మహిళను 48 ఏళ్ల సరితా రామరాజుగా గుర్తించారు. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం దోషిగా తేలితే ఆమెకు 26 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని తెలిపింది.
Also Read:Ponnam Prabhakar : ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటారా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో విడాకులు తీసుకున్న తర్వాత రామరాజు కాలిఫోర్నియా నుంచి వెళ్లిపోయాడు. ఆమె తన కొడుకుతో కలిసి శాంటా అనాలో ఒక మోటెల్లో ఉంటోంది. ఆమె తనకు.. తన కొడుకుకు డిస్నీల్యాండ్కు మూడు రోజుల పాస్లను కొనుగోలు చేసింది. మార్చి 19న రామరాజు మోటెల్ నుంచి బయటకు వెళ్లి అబ్బాయిని అతని తండ్రికి తిరిగి అప్పగించాల్సిన రోజు, ఆమె ఉదయం 9.12 గంటలకు ఎమర్జెన్సీ నెంబర్ 911 కు ఫోన్ చేసి తన కొడుకును చంపి, ఆత్మహత్యకు మాత్రలు వేసుకున్నట్లు తెలిపింది.
Also Read:Keerthy Suresh : బాలీవుడ్ లో మరో సినిమాకు మహానటి గ్రీన్ సిగ్నల్
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తన కొడుకును చంపి, మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె అంగీకరించింది. గదిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. చనిపోయిన బిడ్డను యతిన్ రామరాజుగా గుర్తించారు. సరితా రామరాజును అరెస్టు చేశారు. గత సంవత్సరం నుంచి సరితా రామరాజు, రామరాజు మధ్య కస్టడీ వివాదం కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. వైద్య చికిత్స, పాఠశాల విద్యకు సంబంధించిన నిర్ణయాలను రామరాజు ఏకపక్షంగా తీసుకున్నాడని.. అతను డ్రగ్స్ కు బానిసయ్యాడని సరిత ఆరోపించింది. రామరాజు బెంగళూరులో జన్మించాడని కోర్టు పత్రాలు వెల్లడించాయి. ఇద్దరు తల్లిదండ్రుల మధ్య కోపం కారణంగా పిల్లల జీవితాన్ని ప్రమాదంలో పడేయకూడదు అని ఆరెంజ్ కౌంటీ జిల్లా అటార్నీ టాడ్ స్పిట్జర్ అన్నారు.
తాజావార్తలు
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!