Israel Hamas War: గాజాలో భారత సంతతికి చెందిన సైనికుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: గాజా స్ట్రిప్లో భారత సంతతికి చెందిన ఒక సైనికుడు మరణించాడని భారతదేశంలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కోబి శోషని తెలిపారు. మరణించిన యువకుడు ఇజ్రాయెల్ సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్నాడని.. గాజా స్ట్రిప్లో హమాస్ యోధులతో పోరాడుతూ మరణించాడని కోబి శోషని చెప్పారు. గురువారం ముంబైలో రాయబారి కోబి శోషని మాట్లాడుతూ.. భారతీయ సంతతికి చెందిన 20 సంవత్సరాల వయసున్న హెలెల్ సోలమన్ మరణించినట్లు చెప్పారు. వీరితో పాటు 17 మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు. హెలెల్ సోలమన్ ఇజ్రాయెల్ సైన్యంలో స్టాఫ్ సార్జెంట్గా పనిచేస్తున్నాడు. అతను ఇజ్రాయెల్లోని డిమోనా నగర నివాసి.
Read Also:Postal Vote: నేటి నుంచే పోస్టల్ ఓటుకు దరఖాస్తు.. వారికి మాత్రమే అవకాశం..
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
సైనికుల మృతిపై నెతన్యాహు ఏం చెప్పారు?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ మిలటరీ బ్రిగేడ్ను ఉద్దేశించి మాట్లాడుతూ, మనల్ని ఎవరూ ఆపలేరని అన్నారు. యుద్ధం వల్ల మేం చాలా నష్టపోయాం.. ఈ నష్టం బాధాకరమని, అమరులైన సైనికులంతా మన ప్రపంచం అని, ఎలాంటి పరిస్థితులు మమ్మల్ని అడ్డుకోలేవని ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా’ అని అన్నారు.
Read Also:Tamil Nadu Crime: తమిళనాడులో దారుణం.. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని..!
సంతాపం వ్యక్తం చేసిన మేయర్
హెలెల్ మరణానికి సంతాపం తెలుపుతూ బెని డిమోనా మేయర్ బిట్టన్ ఫేస్బుక్ ఓ పోస్టు చేశారు. గాజాలో జరిగిన యుద్ధంలో డిమోనా కుమారుడు హెలెల్ సోలమన్ మరణించినట్లు.. తాను విచారంతో ప్రకటిస్తున్నా అన్నారు. హెలెల్ మరణంతో నగరం మొత్తం సంతాపం చెందుతోంది. హెలెల్ దేశానికి సేవ చేయాలని కోరుతూ బ్రిగేడ్లో చేరారు. ఇజ్రాయెల్ జెండాతో హెలెల్ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన ఒక పోస్ట్లో రాశారు. గాజాపై దాదాపు నాలుగు వారాల పాటు ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 9,000 కంటే ఎక్కువ పెరిగిందని గాజా ఆరోగ్య అధికారులు గురువారం నివేదించారు.
తాజావార్తలు
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!