Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు
- శ్రీలంక జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.
- అంతర్జాతీయ సరిహద్దులు దాటుకొని వెళ్లి చేపలు పట్టినందుకు మత్స్యకారుల అరెస్టు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతో శ్రీలంక జైళ్ల నుంచి 15 మంది జాలర్ల విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన 15 మంది భారతీయ మత్స్యకారులు గురువారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటుకొని వెళ్లి చేపలు పట్టినందుకు మత్స్యకారులను అరెస్టు చేశారు. తమిళనాడు మత్స్యశాఖ అధికారులు విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికి స్వగ్రామాలకు పంపించారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఎనిమిది మంది మత్స్యకారుల బృందం 2024 సెప్టెంబర్ 27న మన్నార్ ద్వీపం ప్రాంతానికి సమీపంలో చేపలు వేడుతుండగా, శ్రీలంక నావికాదళం సరిహద్దు దాటి చేపలు పట్టినందుకు వారిని అరెస్టు చేసింది. ఆ తర్వాత అరెస్ట్ అయినా వారందరిని శ్రీలంక కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతో శ్రీలంక జైళ్ల నుంచి 15 మంది జాలర్లను విడుదల చేసారు. ఇందులో ముగ్గురు రామేశ్వరం, 12 మంది నాగపట్నంకు చెందిన వారు ఉన్నారు.
Also Read: ISRO: కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో.. డాకింగ్ ప్రక్రియ విజయవంతం
Also Read
కొలంబో నుంచి చెన్నై విమానాశ్రయానికి తరలించిన మత్స్యకారులకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి అత్యవసర పాస్పోర్టులు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. మత్స్యకారులకు మత్స్యశాఖ అధికారులు స్వాగతం పలికి వివిధ వాహనాల్లో స్వగ్రామాలకు తరలించారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న మత్స్యకారులు పౌరసత్వ ధృవీకరణ, కస్టమ్స్ తనిఖీ, ఇతర లాంఛనాలు పూర్తి చేసుకొని వారి స్వగ్రామాలకు పంపించారు అధికారులు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!