India vs South Africa: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. సన్నగిల్లిన సెమీస్ ఆశలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa: సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా పరాజయం పాలైంది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టీ20 వరల్డ్ కప్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన భారత జట్టు సూపర్ 8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. 188 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సూర్య సైన్యం 111 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒక్క శివమ్ దూబే(42) మాత్రమే చివరి వరకు పోరాడాడు. కానీ.. సరైన పాట్నర్ లేకపోవడంతో ఏం చేయలేకపోయాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా 187 పరుగులు చేసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. తొలి ఓవర్లోనే ఐడెన్ మార్క్రమ్ వేసిన ఆఫ్ బ్రేక్ బంతిని భారీ షాట్కు ప్రయత్నించిన కిషన్(0) రియన్ రికెల్టన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లోనే జాన్సెన్ తిలక్ వర్మను అవుట్ చేశాడు. సూర్య, అభిషేక్ల నుంచి భారీ భాగస్వామ్యం ఆశించనా ఫలితం లేకుండా పోయింది. అభిషేక్ మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో జాన్సెన్ అభిషేక్(15)ను అవుట్ చేశాడు. ఆరు ఓవర్ల తర్వాత, భారత స్కోరు 31-3కి పడిపోయింది. ఆ తర్వాత ఎనిమిదో ఓవర్లో వాషింగ్టన్ సుందర్ 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తొమ్మిదో ఓవర్లో భారత్ 50 పరుగుల మార్కును దాటింది.
READ MORE: Jasprit Bumrah: బుమ్రా నయా హిస్టరీ.. టీ20 వరల్డ్కప్ చరిత్రలో టాప్ వికెట్ టేకర్గా యార్కర్ కింగ్..
Also Read
- Water Tank Cleaning Tips: వాటర్ ట్యాంక్లో మురికి పేరుకుపోయిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేయండి
- US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
- Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
10వ ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 18 పరుగులు) ఔటవ్వడంతో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. 10 ఓవర్ల తర్వాత భారత్ 57-5కి పరిమితమైంది. 15వ ఓవర్లో కేశవ్ మహారాజ్ హార్దిక్(18), రింకు సింగ్(0)ను అవుట్ చేశాడు. అదే ఓవర్లో కేశవ్ అర్ష్ దీప్(1)ను సైతం పెవిలియన్కు పంపాడు. దీంతో ఒకే ఓవరల్లో కేశవ్ మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు. శివం దూబే 42 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ టీం ఇండియా 19వ ఓవర్లో 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమి భారత రన్ రేట్ -3.80కి తగ్గింది. దీని అర్థం భారతదేశం తదుపరి రెండు మ్యాచ్లను గణనీయమైన తేడాతో గెలవాలి. భారతదేశం సెమీ-ఫైనల్కు చేరుకోవాలనే ఆశలు ఈ ఓటమితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు.. దక్షిణాఫ్రికా తరఫున జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, లుంగి మూడు, బాష్ రెండు వికెట్లు పడగొట్టారు.
READ MORE: India vs South Africa: మిల్లర్ దూకుడు.. బుమ్రా పంజా! సూపర్ 8లో టీమిండియాకు తప్పని అగ్ని పరీక్ష!
తాజావార్తలు
-
Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్తో పరిచయం.. ‘ఆది’ మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
-
Water Tank Cleaning Tips: వాటర్ ట్యాంక్లో మురికి పేరుకుపోయిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేయండి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘‘భారత క్రికెట్ నిధి’’.. మాజీ స్టార్ ప్రశంసలు..
-
US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!