India vs Pakistan: తాజా రిపోర్ట్స్తో కొత్త టెన్షన్.. భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందని పూర్తిగా చెప్పలేం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: భారత్- పాకిస్థాన్ మ్యాచ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అభిమానులతో స్టేడియం కిక్కిరిసి పోతుంది. నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోతోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పెద్ద పండగే. ఈ ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇండియా-పాక్ మ్యాచ్పై మొదటి నుంచే సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. కొన్ని రోజుల ముందు పాకిస్థాన్ ఈ మ్యాచ్ను బహిష్కిరిస్తామని పెద్ద హై డ్రామా క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అనేక సమావేశాల తర్వాత ఎట్టకేలకు ఆడతామని అంగీకరించింది. అయితే..
తాజాగా ఈ మ్యాచ్కు మరో టెన్షన్ మొదలైంది. అదే వర్షం.
READ MORE: Siddaramaiah: మెత్తబడ్డ సిద్ధరామయ్య.. అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు
Also Read
- Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
- Anupama Singh: "మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది".. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
- Sunil Gavaskar: "పంత్, సంజూ కాదు.. 2027 వరల్డ్ కప్లో వికెట్ కీపర్ అతడే".. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
శనివారం తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. మ్యాచ్ జరిగే అవకాశాలపై సందేహం కలుగుతోంది. పగలు సమయంలో 65 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకుని, చినుకులు మాత్రమే కాదు.. మెరుపులతో కూడిన వాన పడొచ్చని సమాచారం! రాత్రికి వర్షం అవకాశాలు 25 శాతానికి తగ్గుతాయని చెబుతున్నా.. సాయంత్రం 7 గంటల సమయంలో మళ్లీ 49 నుంచి 65 శాతం వర్షం పడే అవకాశం ఉండొచ్చని కొన్ని స్థానిక అంచనాలు సూచిస్తున్నాయి. గాలి ఉత్తర దిశ నుంచి గంటకు సుమారు 11 మైళ్ల వేగంతో వీయనుంది. వాతావరణం మొత్తం తేమగా ఉండే అవకాశముంది. ఈ వార్తల నేపథ్యంలో మ్యాచ్ పూర్తిగా రద్దవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో ఉత్పన్నమవుతోంది. టీ20 మ్యాచ్కు ఫలితం రావాలంటే ప్రతి జట్టు కనీసం 5 ఓవర్లు అయినా ఆడాలి. అంతకంటే తక్కువగా ఆడితే ఫలితం వెలువడదు. అలాంటి పరిస్థితిలో మ్యాచ్ను రద్దు చేసినట్టే అని చెబుతున్నారు. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. అంటే వర్షం వల్ల ఆట ఆగిపోయి 5 ఓవర్లు కూడా పూర్తి కాకపోతే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున ఇస్తారు. మ్యాచ్ను తిరిగి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు లేవు.
READ MORE: MS Dhoni: ఏంటి..! ధోనీని బలవంతంగా కెప్టెన్సీ నుంచి తొలగించారా..? బయట పడిన సంచలన నిజం
ఇప్పటికే ఈ మ్యాచ్ జరగాలని ఐసీసీ చాలా కృషి చేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మొదట భారత్తో ఆడబోమని చెప్పినప్పుడు, ఐసీసీ అధికారులు లాహోర్కి వెళ్లి చర్చలు జరిపారు. చివరకు పాకిస్థాన్ ఒప్పుకుంది. కానీ ఇప్పుడు నిర్ణయం వాతావరణం చేతుల్లో ఉంది. మ్యాచ్ రద్దయితే ప్రసార హక్కులు పొందిన జియోస్టార్ సంస్థ ఎక్కువగా నష్టపోయేది. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. ఆ భారీ వీక్షణల మీదే ప్రకటనల ఆదాయం ఆధారపడి ఉంటుంది. మ్యాచ్ లేకపోతే ఆ ఆదాయం తగ్గిపోతుంది. టికెట్లు కొన్న అభిమానులకు సైతం ఇబ్బంది పడేవారు. మ్యాచ్ పూర్తిగా జరగకపోతే సాధారణంగా టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే శ్రీలంక క్రికెట్ బోర్డుకు గేటు రుసుముల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతుంది. రేపు ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
IVF SCAM: కన్నబడ్డలే కానివాళ్లైతే…! IVF ముసుగులో ఇంత దారుణమా
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
-
Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
-
Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
ట్రెండింగ్
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!