India – Russia: కష్టకాలంలో కదిలొచ్చిన ‘మిత్రుడు’.. చమురు సంక్షోభంలో భారత్ను ఆదుకున్న రష్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – Russia: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా చమురు సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. ఈ సంక్షోభం వల్ల ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో భారత్ చమురు దిగుమతులు 13% తగ్గాయి. అయితే, ఈ గడ్డు కాలంలో రష్యా భారత్కు అండగా నిలిచింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్, మార్చి నెలలో ప్రతిరోజూ 45 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో మధ్యప్రాచ్యం నుంచి సరఫరా 61% పడిపోయి 11.8 లక్షల బ్యారెళ్లకు పరిమితమైంది. గత శనివారం నాడు హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు భారతీయ నౌకలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
READ ALSO: Ganja: గంజాయి మాయలో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఉద్యోగం వదిలి.. ఇంటిపైనే సాగు..
Also Read
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
ఆదుకున్న రష్యా
మధ్యప్రాచ్యం నుంచి చమురు రాక తగ్గడంతో, భారత రిఫైనరీలు రష్యా వైపు మొగ్గు చూపాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రష్యా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. ప్రతిరోజూ సగటున 22.5 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురు భారత్కు చేరుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను నియంత్రించడానికి అమెరికా రష్యన్ చమురుపై ఆంక్షలను సడలించింది. ట్రంప్ ప్రభుత్వం ఈ సడలింపును మరో నెల రోజుల పాటు పొడిగించడం భారత్కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ మినహాయింపు పొందిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇదే సమయంలో చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి (OPEC) వాటా భారత దిగుమతుల్లో రికార్డు స్థాయిలో 29 శాతానికి పడిపోయింది. గతంలో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్, యూఏఈల నుంచి భారత్కు సరఫరా కనిష్ట స్థాయికి పడిపోయింది. మార్చిలో భారత్కు అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో నిలవగా, సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. మధ్యప్రాచ్యం నుంచి చమురు తగ్గడంతో భారత్ ఆఫ్రికా దేశాల నుంచి (ముఖ్యంగా అంగోలా) దిగుమతులు పెంచింది. ప్రస్తుతం అంగోలా మూడవ అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది.
గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఒత్తిడి కారణంగా రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించిన భారత్, ఇప్పుడు యుద్ధం కారణంగా మారిన పరిస్థితుల్లో మళ్లీ రష్యానే నమ్ముకుంది. అమెరికా ఇచ్చిన వెసులుబాటుతో రాబోయే రోజుల్లో రష్యా నుంచి చమురు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
READ ALSO: SRH vs DC: ఉప్పల్లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
తాజావార్తలు
-
Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
-
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
-
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
-
Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!