India – Russia: కష్టకాలంలో కదిలొచ్చిన ‘మిత్రుడు’.. చమురు సంక్షోభంలో భారత్ను ఆదుకున్న రష్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – Russia: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా చమురు సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. ఈ సంక్షోభం వల్ల ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో భారత్ చమురు దిగుమతులు 13% తగ్గాయి. అయితే, ఈ గడ్డు కాలంలో రష్యా భారత్కు అండగా నిలిచింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్, మార్చి నెలలో ప్రతిరోజూ 45 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో మధ్యప్రాచ్యం నుంచి సరఫరా 61% పడిపోయి 11.8 లక్షల బ్యారెళ్లకు పరిమితమైంది. గత శనివారం నాడు హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు భారతీయ నౌకలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
READ ALSO: Ganja: గంజాయి మాయలో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఉద్యోగం వదిలి.. ఇంటిపైనే సాగు..
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఆదుకున్న రష్యా
మధ్యప్రాచ్యం నుంచి చమురు రాక తగ్గడంతో, భారత రిఫైనరీలు రష్యా వైపు మొగ్గు చూపాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రష్యా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. ప్రతిరోజూ సగటున 22.5 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురు భారత్కు చేరుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను నియంత్రించడానికి అమెరికా రష్యన్ చమురుపై ఆంక్షలను సడలించింది. ట్రంప్ ప్రభుత్వం ఈ సడలింపును మరో నెల రోజుల పాటు పొడిగించడం భారత్కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ మినహాయింపు పొందిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇదే సమయంలో చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి (OPEC) వాటా భారత దిగుమతుల్లో రికార్డు స్థాయిలో 29 శాతానికి పడిపోయింది. గతంలో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్, యూఏఈల నుంచి భారత్కు సరఫరా కనిష్ట స్థాయికి పడిపోయింది. మార్చిలో భారత్కు అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో నిలవగా, సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. మధ్యప్రాచ్యం నుంచి చమురు తగ్గడంతో భారత్ ఆఫ్రికా దేశాల నుంచి (ముఖ్యంగా అంగోలా) దిగుమతులు పెంచింది. ప్రస్తుతం అంగోలా మూడవ అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది.
గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఒత్తిడి కారణంగా రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించిన భారత్, ఇప్పుడు యుద్ధం కారణంగా మారిన పరిస్థితుల్లో మళ్లీ రష్యానే నమ్ముకుంది. అమెరికా ఇచ్చిన వెసులుబాటుతో రాబోయే రోజుల్లో రష్యా నుంచి చమురు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
READ ALSO: SRH vs DC: ఉప్పల్లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
తాజావార్తలు
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?