India Pakistan War: ఇండియా-పాకిస్థాన్ యుద్ధం వస్తే.. ఏయే రాష్ట్రాలు ప్రభావితమవుతాయి?
- భారత్-పాకిస్థాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
- దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు
- ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు
- ఒకవేళ యుద్ధం జరిగితే ఏ రాష్ట్రాలు ప్రభావితమవుతాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా నియంత్రణ రేఖ దగ్గర(ఎల్ఓసీ) రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అంతే కాకుండా.. ఇటీవల తుర్కియేకు చెందిన ఓ భారీ యుద్ధ నౌక ఇటీవల పాకిస్థాన్ కు చేరుకుంది. దీంతో భారత్, పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయా.. రానున్న కొన్నిరోజుల్లో పాకిస్థాన్పై భారత్ ఏదైనా చర్య తీసుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక వేళ ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే మన దేశంలోని ఏఏ రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Yamadonga : యమదొంగ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
భారతదేశం- పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలపై ఎఫెక్ట్ ఉంటుంది. జమ్ము కశ్మీర్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి. వాస్తవానికి .. జమ్ము&కశ్మీర్ ప్రాంతం భారత్-పాక్ మధ్య వివాదాస్పదంగా కొనసాగుతోంది. ఇది ఇరు దేశాల మధ్య సరిహద్దు. ఈ ప్రాంతాల్లో యుద్ద ప్రభావం అధికంగా ఉంటుంది. కాగా.. పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు భారత్-పాక్ సరిహద్దులో ఉన్నాయి. ఈ రాష్ట్రాలపై ప్రభావం అధికంగా ఉంటుంది. సరిహద్దు నగరాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది.
READ MORE: India Pakistan: పాకిస్తాన్తో వరద హెచ్చరికలు.. చీనాబ్ నది గేట్లు ఎత్తేసిన భారత్..!
కాగా.. భారత ప్రభుత్వం ఇప్పటికే అన్నింటికీ సిద్ధమైంది. తాజాగా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశం నుంచి దాడులు జరిగితే.. ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన అంశాలపై మే 7వ తేదీన (బుధవారం) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ సెక్యూరిటీ మాక్ డ్రిల్స్కు సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో తాజాగా కీలక భేటీ జరిగింది. దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా ఈ సమావేశంలో విభజించారు. ప్రధానమంత్రి నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీతోపాటు తారాపూర్ అణు కేంద్రాన్ని కేటగిరి 1లో పెట్టారు. ఇక కేటగిరి 2లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. రేపు దేశవ్యాప్తంగా మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కాశ్మీర్, గుజరాత్, హర్యాణా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!