India Pakistan War: ఇండియా-పాకిస్థాన్ యుద్ధం వస్తే.. ఏయే రాష్ట్రాలు ప్రభావితమవుతాయి?
- భారత్-పాకిస్థాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
- దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు
- ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు
- ఒకవేళ యుద్ధం జరిగితే ఏ రాష్ట్రాలు ప్రభావితమవుతాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా నియంత్రణ రేఖ దగ్గర(ఎల్ఓసీ) రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అంతే కాకుండా.. ఇటీవల తుర్కియేకు చెందిన ఓ భారీ యుద్ధ నౌక ఇటీవల పాకిస్థాన్ కు చేరుకుంది. దీంతో భారత్, పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయా.. రానున్న కొన్నిరోజుల్లో పాకిస్థాన్పై భారత్ ఏదైనా చర్య తీసుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక వేళ ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే మన దేశంలోని ఏఏ రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Yamadonga : యమదొంగ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
Also Read
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
భారతదేశం- పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలపై ఎఫెక్ట్ ఉంటుంది. జమ్ము కశ్మీర్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి. వాస్తవానికి .. జమ్ము&కశ్మీర్ ప్రాంతం భారత్-పాక్ మధ్య వివాదాస్పదంగా కొనసాగుతోంది. ఇది ఇరు దేశాల మధ్య సరిహద్దు. ఈ ప్రాంతాల్లో యుద్ద ప్రభావం అధికంగా ఉంటుంది. కాగా.. పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు భారత్-పాక్ సరిహద్దులో ఉన్నాయి. ఈ రాష్ట్రాలపై ప్రభావం అధికంగా ఉంటుంది. సరిహద్దు నగరాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది.
READ MORE: India Pakistan: పాకిస్తాన్తో వరద హెచ్చరికలు.. చీనాబ్ నది గేట్లు ఎత్తేసిన భారత్..!
కాగా.. భారత ప్రభుత్వం ఇప్పటికే అన్నింటికీ సిద్ధమైంది. తాజాగా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశం నుంచి దాడులు జరిగితే.. ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన అంశాలపై మే 7వ తేదీన (బుధవారం) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ సెక్యూరిటీ మాక్ డ్రిల్స్కు సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో తాజాగా కీలక భేటీ జరిగింది. దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా ఈ సమావేశంలో విభజించారు. ప్రధానమంత్రి నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీతోపాటు తారాపూర్ అణు కేంద్రాన్ని కేటగిరి 1లో పెట్టారు. ఇక కేటగిరి 2లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. రేపు దేశవ్యాప్తంగా మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కాశ్మీర్, గుజరాత్, హర్యాణా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?