India-Pakistan Relations: భారత్తో మెరుగైన సంబంధాల కోసం పాకిస్థాన్లో డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ మార్కెట్లలో కూడా భారత్తో మెరుగైన సంబంధాల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఇటీవల, పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించవచ్చని సూచించింది. ఇక, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్తో వాణిజ్యాన్ని త్వరలోనే పునరుద్ధరించవచ్చని సూచించారు. పాకిస్థానీ వ్యాపారవేత్తలు భారత్తో వ్యాపారం చేయాలనుకుంటున్నారు.. పాక్ సర్కార్ వ్యాపారవేత్తలతో మాట్లాడటం ద్వారా దీనికి సంబంధించిన అవకాశాలను అన్వేషిస్తుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్తో వాణిజ్యం పునః ప్రారంభించాలనే చర్చ మొదలైంది. భారత్తో సంబంధాలను పెట్టుకుని.. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు.
Read Also: Srungavarapu Kota: ఆ నియోజకవర్గం టీడీపీలో కుంపటి.. ఇండిపెండెంట్గా బరిలోకి..!
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ఇక, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ ను దూరం పెట్టింది. ఆ ఉగ్రవాద ఘటనలో పాకిస్తానీ గ్రూపు జైషే మహ్మద్కు చెందిన ఉగ్రవాదులు మన దేశానికి చెందిన ఆర్మీ జవాన్ల కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో 40 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత పాకిస్థాన్కు ఉన్న ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుంది. అలాగే, 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అప్పటి నుంచి పాకిస్థాన్ భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను క్యాన్సిల్ చేసుకుంది. అయితే, పాక్ దిగుమతులపై భారత్ 200 శాతం సుంకం విధించడమే కారణమని చెబుతున్నారు.
Read Also: Fire In Temple: ఆలయంలో పెను ప్రమాదం.. హారతిలో మంటలు ..12మందికి గాయాలు
అలాగే, భారత్తో వాణిజ్యం ఆగిపోవడంతో పాకిస్థాన్ సుదూర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీని కారణంగా ఇప్పటికే ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు మరింత తగ్గిపోతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వ్యాపారం పునఃప్రారంభానికి సంబంధించి పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సూచనలు చేసినట్లు తెలుస్తున్నప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ఇక, పాకిస్థాన్ కొత్త ప్రభుత్వం ఇండియాతో వాణిజ్య వ్యాపారం కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కొత్త పాలసీని రూపొందిచినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..