India-Pakistan Relations: భారత్తో మెరుగైన సంబంధాల కోసం పాకిస్థాన్లో డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ మార్కెట్లలో కూడా భారత్తో మెరుగైన సంబంధాల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఇటీవల, పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించవచ్చని సూచించింది. ఇక, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్తో వాణిజ్యాన్ని త్వరలోనే పునరుద్ధరించవచ్చని సూచించారు. పాకిస్థానీ వ్యాపారవేత్తలు భారత్తో వ్యాపారం చేయాలనుకుంటున్నారు.. పాక్ సర్కార్ వ్యాపారవేత్తలతో మాట్లాడటం ద్వారా దీనికి సంబంధించిన అవకాశాలను అన్వేషిస్తుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్తో వాణిజ్యం పునః ప్రారంభించాలనే చర్చ మొదలైంది. భారత్తో సంబంధాలను పెట్టుకుని.. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు.
Read Also: Srungavarapu Kota: ఆ నియోజకవర్గం టీడీపీలో కుంపటి.. ఇండిపెండెంట్గా బరిలోకి..!
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ఇక, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ ను దూరం పెట్టింది. ఆ ఉగ్రవాద ఘటనలో పాకిస్తానీ గ్రూపు జైషే మహ్మద్కు చెందిన ఉగ్రవాదులు మన దేశానికి చెందిన ఆర్మీ జవాన్ల కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో 40 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత పాకిస్థాన్కు ఉన్న ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుంది. అలాగే, 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అప్పటి నుంచి పాకిస్థాన్ భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను క్యాన్సిల్ చేసుకుంది. అయితే, పాక్ దిగుమతులపై భారత్ 200 శాతం సుంకం విధించడమే కారణమని చెబుతున్నారు.
Read Also: Fire In Temple: ఆలయంలో పెను ప్రమాదం.. హారతిలో మంటలు ..12మందికి గాయాలు
అలాగే, భారత్తో వాణిజ్యం ఆగిపోవడంతో పాకిస్థాన్ సుదూర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీని కారణంగా ఇప్పటికే ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు మరింత తగ్గిపోతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వ్యాపారం పునఃప్రారంభానికి సంబంధించి పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సూచనలు చేసినట్లు తెలుస్తున్నప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ఇక, పాకిస్థాన్ కొత్త ప్రభుత్వం ఇండియాతో వాణిజ్య వ్యాపారం కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కొత్త పాలసీని రూపొందిచినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!