World Cup 2023: భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్కు వెళ్లడం ఖాయం.. ఆ జట్ల పరిస్థితి దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ 2023 మ్యాచ్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఆతిథ్య భారత్.. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ మాత్రమే టోర్నీలో అజేయంగా నిలిచాయి. ఈ జట్లు నాలుగింట నాలుగు మ్యాచ్ల్లో గెలిచాయి. ఈ వరల్డ్ కప్ లో ఈ జట్ల విజయ పరంపర కొనసాగుతుండడంతో భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం అని స్పష్టమవుతోంది. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి జట్ల పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తోంది.
Read Also: Team India: హార్ధిక్ లేని లోటును ఏ ప్లేయర్ తీర్చనున్నాడు.. ఫ్యాన్స్లో ఆందోళన
Also Read
ప్రస్తుతం న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ +1.923తో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా 8 పాయింట్లతో +1.659 నెట్ రన్ రేట్ తో రెండవ స్థానంలో ఉంది. టేబుల్లోని టాప్-4 జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే ఏ జట్టు అయినా 9 లీగ్ మ్యాచ్లలో 7 గెలవాలి. తర్వాత జరిగే 5 మ్యాచ్లలో భారత్, న్యూజిలాండ్ 3 మ్యాచ్లు గెలవాలి.
Read Also: CPI Ramakrishna: రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం..
కాగా.. టోర్నీలో ఫేవరెట్గా చెప్పుకునే పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో పాకిస్థాన్ 2 గెలుపొందగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్నే అందుకున్నాయి. ఈ మూడు టీంల నెట్ రన్ రేట్ ప్రతికూలంగా ఉంది. దక్షిణాఫ్రికా జట్టు 3 మ్యాచ్లలో 2 గెలిచి మూడవ స్థానంలో ఉంది. జట్టు రన్ రేట్ కూడా సానుకూలంగా ఉంది. ఇప్పటివరకు అజేయంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్లు అక్టోబర్ 22 ఆదివారం ధర్మశాలలో తలపడనున్నాయి. ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఓ జట్టుకైతే విజయాల పరంపరకు బ్రేక్ పడనుంది. ఆదివారం ఏ జట్టు గెలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!