ప్రపంచకప్ 2023 మ్యాచ్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఆతిథ్య భారత్.. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ మాత్రమే టోర్నీలో అజేయంగా నిలిచాయి. ఈ జట్లు నాలుగింట నాలుగు మ్యాచ్ల్లో గెలిచాయి. ఈ వరల్డ్ కప్ లో ఈ జట్ల విజయ పరంపర కొనసాగుతుండడంతో భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం అని స్పష్టమవుతోంది. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి జట్ల పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తోంది.
Read Also: Team India: హార్ధిక్ లేని లోటును ఏ ప్లేయర్ తీర్చనున్నాడు.. ఫ్యాన్స్లో ఆందోళన
ప్రస్తుతం న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ +1.923తో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా 8 పాయింట్లతో +1.659 నెట్ రన్ రేట్ తో రెండవ స్థానంలో ఉంది. టేబుల్లోని టాప్-4 జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే ఏ జట్టు అయినా 9 లీగ్ మ్యాచ్లలో 7 గెలవాలి. తర్వాత జరిగే 5 మ్యాచ్లలో భారత్, న్యూజిలాండ్ 3 మ్యాచ్లు గెలవాలి.
Read Also: CPI Ramakrishna: రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం..
కాగా.. టోర్నీలో ఫేవరెట్గా చెప్పుకునే పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో పాకిస్థాన్ 2 గెలుపొందగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్నే అందుకున్నాయి. ఈ మూడు టీంల నెట్ రన్ రేట్ ప్రతికూలంగా ఉంది. దక్షిణాఫ్రికా జట్టు 3 మ్యాచ్లలో 2 గెలిచి మూడవ స్థానంలో ఉంది. జట్టు రన్ రేట్ కూడా సానుకూలంగా ఉంది. ఇప్పటివరకు అజేయంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్లు అక్టోబర్ 22 ఆదివారం ధర్మశాలలో తలపడనున్నాయి. ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఓ జట్టుకైతే విజయాల పరంపరకు బ్రేక్ పడనుంది. ఆదివారం ఏ జట్టు గెలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.