India Gets LPG Relief: ఎల్పీజీ కష్టాలకు ఇక బ్రేక్..? భారత్కు చేరిన భారీ గ్యాస్ నౌక.. దారిలో మరిన్ని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Gets LPG Relief Amid Strait of Hormuz Tensions: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన తరుణంలో, భారతదేశానికి ఒక ఊరటనిచ్చే వార్త అందింది. ఎల్పీజీ కష్టాలకు నెమ్మదిగా బ్రేక్ పడుతోంది. తాజాగా మరో ఎల్పీజీ నౌక భారత్కు చేరింది.. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న ఒక భారీ సరుకు రవాణా నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరుకుంది. పిక్సిస్ పయనీర్ నౌక 16,714 టన్నుల ఎల్పీజీని మోసుకొని మంగళూరు పోర్టుకు చేరింది. వచ్చే వారంలో ఇంకా 72,700 టన్నుల ఎల్పీజీ రానుంది. ఈనెల 25న 26,687 టన్నుల ఎల్పీజీతో అపోలో ఓషన్ రానుంది.. ఈనెల 29న 30 వేల టన్నుల ఎల్పీజీతో మరో నౌక భారత్కు చేరనుంది. అంతే కాదు.. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నౌకలు, నావికులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
READ MORE: India vs Ireland: ఐర్లాండ్తో టీ20 సిరీస్.. బీసీసీఐ కీలక నిర్ణయం, కొత్త యుగానికి నాంది!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
వ్యూహాత్మకంగా ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడిన తరుణంలో నౌక భారత్కు చేరడం గర్వకారణంగా చెబుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఇంధన సరఫరాలను నిర్ధారించడానికి, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుంచి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీపై కార్గో ఛార్జీల మాఫీని సైతం ప్రకటించడం బిగ్ రిలీఫ్గా మారింది. ఈ అంశంపై షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా, అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో దేశానికి భరోసా ఇచ్చారు. “గత 24 గంటల్లో సముద్రంలో ఎలాంటి అలజడి, దాడులు చోటు చేసుకోలేదు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న మన 22 నౌకలు, 611 మంది భారతీయ నావికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. మేము వారి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం, ప్రస్తుతం ఏ ఓడరేవులోనూ రద్దీ లేదు” అని స్పష్టం చేశారు. మరోవైపు.. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఇప్పుడు అదుపులోకి వచ్చిందని తెలిపారు. వినియోగదారులలో భయాందోళనలతో చేసే బుకింగ్లు గణనీయంగా తగ్గాయని అన్నారు. సంక్షోభం ప్రారంభ రోజులతో పోలిస్తే గురువారం కేవలం 55 లక్షల బుకింగ్లు మాత్రమే నమోదయ్యాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!