Cricketers Salary: ఎందుకు ఇంత చిన్న చూపు.. పురుషుల, మహిళల వేతనాలలో ఎంత తేడానో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricketers Salary: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ టోర్నమెంట్లలో తమకు తొలిసారిగా విజయం దక్కించుకుని.. మొదటి మహిళల ప్రపంచకప్ను కైవసం చేసుకున్న ఈ ఘనత దేశవ్యాప్తంగా వేడుకలు చేసుకునేందుకు కారణంగా నిలిచింది. 52 పరుగుల తేడాతో సాధించిన ఈ విజయం భారత మహిళా క్రికెట్పై దేశం దృష్టిని మళ్లించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని భారత మహిళల క్రికెట్లోని ఆర్థిక స్థితిగతులను పరిశీలించడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీసీసీఐ అందించే వార్షిక వేతనాలు ప్రధాన అంశంగా నిలిచింది.
200MP కెమెరా, 5400mAh బ్యాటరీ.. Samsung Galaxy S26 వచ్చేది అప్పుడే!
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
బీసీసీఐ మార్చి 24, 2025న విడుదల చేసిన “వార్షిక ప్లేయర్ రిటైన్ర్షిప్ 2024–25 టీమ్ ఇండియా (సీనియర్ మహిళలు) ప్రకారం.. మహిళా క్రికెటర్లకు జీతాలు మూడు గ్రేడ్లుగా విభజించబడ్డాయి. ఇందులో గ్రేడ్ A కాంట్రాక్ట్ పొందిన క్రీడాకారిణులకు సంవత్సరానికి రూ.50 లక్షలు వేతనం లభిస్తుంది. ఈ విభాగంలో హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు. ఇక గ్రేడ్ B కాంట్రాక్ట్లో ఉన్న రేణుక ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ వంటి ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.30 లక్షలు లభిస్తాయి. ఇక గ్రేడ్ C కాంట్రాక్ట్లో ఉన్న రాధా యాదవ్, అమన్జోత్ కౌర్, ఉమా చైత్రీ, స్నేహ్ రాణా, ఇతర తొమ్మిది మంది క్రీడాకారిణులకు సంవత్సరానికి రూ.10 లక్షల వేతనం చెల్లిస్తారు.
Richest Female Cricketers: ఆటే కాదు సంపదలో కూడా ఘనమే.. టీమిండియా రిచెస్ట్ మహిళా క్రికేటర్స్ వీరే..!
అయితే ఈ వేతనాలు భారత పురుషుల జట్టుతో పోల్చితే.. భారీ వ్యత్యాసం కనపడుతుంది. ఏప్రిల్ 21, 2025న విడుదల చేసిన పురుషుల జట్టు కాంట్రాక్ట్ ప్రకారం A+ గ్రేడ్ ఆటగాళ్లకు 7 కోట్లు, A గ్రేడ్కి 5 కోట్లు, B గ్రేడ్కి 3 కోట్లు, C గ్రేడ్కి 1 కోటి వేతనం లభిస్తోంది. దీనితో పోలిస్తే మహిళల జట్టులో అగ్రశ్రేణి కాంట్రాక్ట్ అయిన గ్రేడ్ A వేతనం కేవలం రూ.50 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. అయితే మ్యాచ్ ఫీజు విషయంలో మాత్రం సమానత్వం కనపడుతుంది. బీసీసీఐ పురుషులు, మహిళలకు సమానమైన మ్యాచ్ ఫీజును అందిస్తోంది. టెస్ట్ మ్యాచ్కు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20 మ్యాచ్కు 3 లక్షలుగా చెల్లిస్తోంది. పురుషుల జట్టు ఏడాదికి ఎక్కువ సంఖ్యలో మ్యాచ్లు ఆడుతుండటంతో మ్యాచ్ ఫీజుల ద్వారా వారి మొత్తం ఆదాయం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!