మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 26,115 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,04,534 కి చేరింది. ఇందులో 3,27,49,574 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 3,09,575 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 252 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,45,385 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో3 4,469 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.