Niger Crisis: ఆ దేశాన్ని త్వరగా విడిచి పెట్టండి.. భారతీయులకు కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niger Crisis: ఆఫ్రికన్ దేశమైన నైగర్లోని భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అక్కడి పరిస్థితులను వివరిస్తూ వీలైనంత త్వరగా నైగర్ వదిలి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆగస్టు 11న భారతీయ పౌరులందరికీ సూచించింది. ఇది కాకుండా పరిస్థితి సాధారణమయ్యే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయులకు సూచించింది. మీడియాను ఉద్దేశించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. నైగర్లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీలైనంత త్వరగా భారతీయ పౌరులు దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం గగనతలం మూసివేయబడిందని, భూసరిహద్దు గుండా బయలుదేరేటప్పుడు భద్రతను నిర్ధారించుకుని చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో నైజర్కు వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారు కూడా పరిస్థితి సాధారణమయ్యే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు.
Also Read: Import Ban: కెమెరా, ప్రింటర్, టెలిఫోన్ దిగుమతుల నిషేధం ?
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
వివరాల ప్రకారం.. నైగర్లో ధ్వంసమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి దళాలను మోహరించాలని ఆదేశించిన తర్వాత.. నైజర్ కొత్త మిలిటరీ పాలన, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమి మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. బహిష్కరించబడిన ప్రెసిడెంట్ మహమ్మద్ బజౌమ్ను తిరిగి నియమించడానికి ఆదివారం గడువు ముగియడంతో నైజర్లో రాజ్యాంగ క్రమాన్ని పునరుద్ధరించడానికి సాయుధ దళాలను ఆదేశించినట్లు తెలిసింది. ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి పొరుగు దేశాలు ఏదైనా సైనిక జోక్యానికి ప్రయత్నించినట్లయితే, బజౌమ్ను చంపేస్తామని నైజర్ జుంటా అమెరికా దౌత్యవేత్తతో చెప్పినట్లు ఇద్దరు పాశ్చాత్య అధికారులు తెలిపినట్లు సమాచారం. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమిలో 15 సభ్య దేశాలు నైజర్ ప్రభుత్వానికి సహకరిస్తాయో ప్రస్తుతం అస్పష్టంగా ఉన్నప్పటికీ.. నైజీరియా, బెనిన్తో పాటు తమ దేశం సైనిక చర్యలో పాల్గొంటుందని పొరుగు ఉన్న ఐవరీ కోస్ట్ అధ్యక్షుడు అలస్సేన్ ఔట్టారా చెప్పారు. ఐవరీకోస్ట్ ఒక బెటాలియన్ అందిస్తుందని, అన్ని ఆర్థిక ఏర్పాట్లు చేస్తుందని.. నైజర్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వమే తమ లక్ష్యమన్నారు.
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!