Niger Crisis: ఆ దేశాన్ని త్వరగా విడిచి పెట్టండి.. భారతీయులకు కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niger Crisis: ఆఫ్రికన్ దేశమైన నైగర్లోని భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అక్కడి పరిస్థితులను వివరిస్తూ వీలైనంత త్వరగా నైగర్ వదిలి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆగస్టు 11న భారతీయ పౌరులందరికీ సూచించింది. ఇది కాకుండా పరిస్థితి సాధారణమయ్యే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయులకు సూచించింది. మీడియాను ఉద్దేశించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. నైగర్లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీలైనంత త్వరగా భారతీయ పౌరులు దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం గగనతలం మూసివేయబడిందని, భూసరిహద్దు గుండా బయలుదేరేటప్పుడు భద్రతను నిర్ధారించుకుని చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో నైజర్కు వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారు కూడా పరిస్థితి సాధారణమయ్యే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు.
Also Read: Import Ban: కెమెరా, ప్రింటర్, టెలిఫోన్ దిగుమతుల నిషేధం ?
Also Read
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
వివరాల ప్రకారం.. నైగర్లో ధ్వంసమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి దళాలను మోహరించాలని ఆదేశించిన తర్వాత.. నైజర్ కొత్త మిలిటరీ పాలన, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమి మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. బహిష్కరించబడిన ప్రెసిడెంట్ మహమ్మద్ బజౌమ్ను తిరిగి నియమించడానికి ఆదివారం గడువు ముగియడంతో నైజర్లో రాజ్యాంగ క్రమాన్ని పునరుద్ధరించడానికి సాయుధ దళాలను ఆదేశించినట్లు తెలిసింది. ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి పొరుగు దేశాలు ఏదైనా సైనిక జోక్యానికి ప్రయత్నించినట్లయితే, బజౌమ్ను చంపేస్తామని నైజర్ జుంటా అమెరికా దౌత్యవేత్తతో చెప్పినట్లు ఇద్దరు పాశ్చాత్య అధికారులు తెలిపినట్లు సమాచారం. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమిలో 15 సభ్య దేశాలు నైజర్ ప్రభుత్వానికి సహకరిస్తాయో ప్రస్తుతం అస్పష్టంగా ఉన్నప్పటికీ.. నైజీరియా, బెనిన్తో పాటు తమ దేశం సైనిక చర్యలో పాల్గొంటుందని పొరుగు ఉన్న ఐవరీ కోస్ట్ అధ్యక్షుడు అలస్సేన్ ఔట్టారా చెప్పారు. ఐవరీకోస్ట్ ఒక బెటాలియన్ అందిస్తుందని, అన్ని ఆర్థిక ఏర్పాట్లు చేస్తుందని.. నైజర్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వమే తమ లక్ష్యమన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!