Niger Crisis: ఆ దేశాన్ని త్వరగా విడిచి పెట్టండి.. భారతీయులకు కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niger Crisis: ఆఫ్రికన్ దేశమైన నైగర్లోని భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అక్కడి పరిస్థితులను వివరిస్తూ వీలైనంత త్వరగా నైగర్ వదిలి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆగస్టు 11న భారతీయ పౌరులందరికీ సూచించింది. ఇది కాకుండా పరిస్థితి సాధారణమయ్యే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయులకు సూచించింది. మీడియాను ఉద్దేశించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. నైగర్లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీలైనంత త్వరగా భారతీయ పౌరులు దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం గగనతలం మూసివేయబడిందని, భూసరిహద్దు గుండా బయలుదేరేటప్పుడు భద్రతను నిర్ధారించుకుని చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో నైజర్కు వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారు కూడా పరిస్థితి సాధారణమయ్యే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు.
Also Read: Import Ban: కెమెరా, ప్రింటర్, టెలిఫోన్ దిగుమతుల నిషేధం ?
Also Read
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- Mohammad Rizwan - Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ - బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
వివరాల ప్రకారం.. నైగర్లో ధ్వంసమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి దళాలను మోహరించాలని ఆదేశించిన తర్వాత.. నైజర్ కొత్త మిలిటరీ పాలన, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమి మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. బహిష్కరించబడిన ప్రెసిడెంట్ మహమ్మద్ బజౌమ్ను తిరిగి నియమించడానికి ఆదివారం గడువు ముగియడంతో నైజర్లో రాజ్యాంగ క్రమాన్ని పునరుద్ధరించడానికి సాయుధ దళాలను ఆదేశించినట్లు తెలిసింది. ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి పొరుగు దేశాలు ఏదైనా సైనిక జోక్యానికి ప్రయత్నించినట్లయితే, బజౌమ్ను చంపేస్తామని నైజర్ జుంటా అమెరికా దౌత్యవేత్తతో చెప్పినట్లు ఇద్దరు పాశ్చాత్య అధికారులు తెలిపినట్లు సమాచారం. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమిలో 15 సభ్య దేశాలు నైజర్ ప్రభుత్వానికి సహకరిస్తాయో ప్రస్తుతం అస్పష్టంగా ఉన్నప్పటికీ.. నైజీరియా, బెనిన్తో పాటు తమ దేశం సైనిక చర్యలో పాల్గొంటుందని పొరుగు ఉన్న ఐవరీ కోస్ట్ అధ్యక్షుడు అలస్సేన్ ఔట్టారా చెప్పారు. ఐవరీకోస్ట్ ఒక బెటాలియన్ అందిస్తుందని, అన్ని ఆర్థిక ఏర్పాట్లు చేస్తుందని.. నైజర్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వమే తమ లక్ష్యమన్నారు.
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!