Niger Crisis: ఆ దేశాన్ని త్వరగా విడిచి పెట్టండి.. భారతీయులకు కేంద్రం సూచన
Niger Crisis: ఆఫ్రికన్ దేశమైన నైగర్లోని భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అక్కడి పరిస్థితులను వివరిస్తూ వీలైనంత త్వరగా నైగర్ వదిలి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆగస్టు 11న భారతీయ పౌరులందరికీ సూచించింది. ఇది కాకుండా పరిస్థితి సాధారణమయ్యే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయులకు సూచించింది. మీడియాను ఉద్దేశించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. నైగర్లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీలైనంత త్వరగా భారతీయ పౌరులు దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం గగనతలం మూసివేయబడిందని, భూసరిహద్దు గుండా బయలుదేరేటప్పుడు భద్రతను నిర్ధారించుకుని చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో నైజర్కు వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారు కూడా పరిస్థితి సాధారణమయ్యే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు.
Also Read: Import Ban: కెమెరా, ప్రింటర్, టెలిఫోన్ దిగుమతుల నిషేధం ?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
వివరాల ప్రకారం.. నైగర్లో ధ్వంసమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి దళాలను మోహరించాలని ఆదేశించిన తర్వాత.. నైజర్ కొత్త మిలిటరీ పాలన, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమి మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. బహిష్కరించబడిన ప్రెసిడెంట్ మహమ్మద్ బజౌమ్ను తిరిగి నియమించడానికి ఆదివారం గడువు ముగియడంతో నైజర్లో రాజ్యాంగ క్రమాన్ని పునరుద్ధరించడానికి సాయుధ దళాలను ఆదేశించినట్లు తెలిసింది. ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి పొరుగు దేశాలు ఏదైనా సైనిక జోక్యానికి ప్రయత్నించినట్లయితే, బజౌమ్ను చంపేస్తామని నైజర్ జుంటా అమెరికా దౌత్యవేత్తతో చెప్పినట్లు ఇద్దరు పాశ్చాత్య అధికారులు తెలిపినట్లు సమాచారం. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమిలో 15 సభ్య దేశాలు నైజర్ ప్రభుత్వానికి సహకరిస్తాయో ప్రస్తుతం అస్పష్టంగా ఉన్నప్పటికీ.. నైజీరియా, బెనిన్తో పాటు తమ దేశం సైనిక చర్యలో పాల్గొంటుందని పొరుగు ఉన్న ఐవరీ కోస్ట్ అధ్యక్షుడు అలస్సేన్ ఔట్టారా చెప్పారు. ఐవరీకోస్ట్ ఒక బెటాలియన్ అందిస్తుందని, అన్ని ఆర్థిక ఏర్పాట్లు చేస్తుందని.. నైజర్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వమే తమ లక్ష్యమన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!