Vijaysai Reddy: ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు.. మాది న్యూట్రల్ స్టాండ్!
- కూటమిలో చేరే ఆలోచన లేదు
- ఇండియా కూటమి, ఎన్డీఏలకు సమాన దూరం
- రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని, తమది న్యూట్రల్ స్టాండ్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇండియా కూటమి, ఎన్డీఏలకు తాము సమాన దూరం అని పేర్కొన్నారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయం చెబుతాంని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పిన మాట ఎప్పుడు చెయ్యలేదని, బాబు చేతుల్లో జనం నాలుగోసారి మోసపోయారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
‘ఇండియా కూటమి, ఎన్డీఏ.. రెండింటికీ మేం సమాన దూరం. ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు, మాది న్యూట్రల్ స్టాండ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట మా అభిప్రాయం చెబుతాం. ప్రాథమిక దశలో మేం వ్యతిరేకించలేదు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చేసే ఆందోళనలతో సమిష్టిగా పోరాటం చెయ్యాలి. సామాన్యులపై విద్యుత్ భారం తగ్గించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం’ అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
Also Read
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
‘సీఎం నారా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పిన మాట ఎప్పుడు చెయ్యలేదు. చంద్రబాబు చేతుల్లో జనం నాలుగోసారి మోసపోయారు. నాణ్యమైన విద్య, వైద్యం ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి.. నాణ్యమైన మద్యం అమ్మకాలకు మాత్రమే పరిమితం అయ్యింది. మా హయాంలో మెరుగైన విద్య, వైద్యంను అందించాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్యుత్ భారం తగ్గించే వరకు పోరాటం చేస్తాం’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!