Womens Asia Cup Final: శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్
- కాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్లో విజయం సాధించి మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించి రికార్డు స్థాయిలో 8వ టైటిల్ను గెలుచుకోవాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బౌలర్లు ఇప్పటి వరకు బాగానే రాణించారు. తమ ప్రత్యర్థి జట్లకు ఇంకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
Read Also: Vishwak Sen: ఇన్స్టాగ్రామ్ డీ యాక్టివ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా..?
Also Read
- Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బౌలర్లు ఇప్పటి వరకు బాగానే రాణించారు. తమ ప్రత్యర్థి జట్లకు ఇంకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఇప్పటివరకు జట్టుకు శుభారంభాలు అందించారు, అయితే బౌలర్లు ముఖ్యంగా దీప్తి శర్మ, రేణుకా సింగ్ ప్రదర్శన పట్ల టీమ్ మేనేజ్మెంట్ చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో ఇప్పటివరకు దీప్తి అత్యధికంగా తొమ్మిది వికెట్లు పడగొట్టగా, రేణుక ఏడు వికెట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Read Also: Kidnap Case: బ్యాంకాక్లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
మరోవైపు.. శ్రీలంక తరఫున కెప్టెన్ చమరి అటపట్టు అద్భుత ప్రదర్శన చేస్తుంది. ఆమె ఇప్పటివరకు 243 పరుగులు చేసింది, కానీ ఆమె తప్ప, మరే ఇతర శ్రీలంక బ్యాట్స్మెన్ 100 పరుగులను చేరుకోలేదు. భారత్ విజయాన్ని నమోదు చేసుకోవాలంటే శ్రీలంక కెప్టెన్ను నియంత్రించాల్సి ఉంటుంది. భారత్ పటిష్ట బ్యాటింగ్ లైనప్పై శ్రీలంక బౌలర్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది. ఆఫ్ స్పిన్నర్ కవిషా దిల్హరి (ఏడు వికెట్లు) మినహా ఇతర శ్రీలంక బౌలర్లు ఇప్పటివరకు ప్రభావం చూపలేకపోయారు.
ఇండియా ఉమెన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ఉమా చెత్రీ (వికెట్ కీపర్/బ్యాటర్), హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా సింగ్.
శ్రీలంక ఉమెన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
విష్మి గుణరత్నే, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, నీలక్షికా సిల్వా, హాసిని పెరీరా, కవిషా దిల్హరి, అనుష్క సంజీవని(వికెట్ కీపర్/బ్యాటర్), సుగందికా కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసల.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!