IND W vs SA W: ఐదు వికెట్లతో చెలరేగిన స్నేహ రాణా.. భారత్ ఘన విజయం
- ట్రై సిరీస్లో భారత్ మహిళల జట్టు ఖాతాలో మరో విజయం.
- ఐదు వికెట్లతో చెలరేగిన స్నేహ రాణా..
- తజ్మిన్ బ్రిట్స్ శతకం వృధా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs SA W: శ్రీలంకలో జరుగుతున్న మహిళల మూడు జట్ల మధ్య వన్డే ట్రై సిరీస్లో భారత్ మహిళల జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. కొలంబో వేదికగా నేడు జరిగిన రెండో మ్యాచ్లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ప్రతికా రవాల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 78 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం అందించింది. ఇక భారత మిగతా బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్ (41), హర్మన్ప్రీత్ కౌర్ (41 నాటౌట్), స్మృతి మంధానా (36), రిచా ఘోష్ (24)లు సమిష్టిగా రాణించారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో మ్లాబా రెండు వికెట్లు తీసింది. ఖాఖా, క్లాస్, డె క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ తీసుకున్నారు.
Read Also: TGSRTC Strike: ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. ఎప్పటినుంచంటే?
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
ఇక 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ 109 పరుగులతో సెంచరీ సాధించినా, మిగతా బ్యాటర్లు సరైన మద్దతు ఇవ్వలేకపోవడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. కెప్టెన్ వోల్వర్డ్ట్ 43 పరుగులు చేయగా, చివర్లో డెర్క్సెన్ 30 పరుగులతో కొంత పోరాటం చేసినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక భారత్ బౌలింగ్ వైపు నుంచి ఆఫ్ స్పిన్నర్ స్నేహ రాణా అద్భుత ప్రదర్శన చేసింది. 43 పరుగులిచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా జట్టు ఛేజింగ్ను దెబ్బతీసింది. అలాగే దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్నేహ రాణా “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డుకు ఎంపికయ్యింది.
Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ సూత్రధారికి పాకిస్తాన్ కమాండో ట్రైనింగ్..
ఈ విజయం ద్వారా భారత్ మహిళల జట్టు సిరీస్లో తమ రెండవ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ముందంజలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సమిష్టిగా రాణించిన భారత్ జట్టు వచ్చే మ్యాచ్లకు మంచి మోమెంటంను సంపాదించుకుంది. మొత్తానికి, తజ్మిన్ బ్రిట్స్ శతకం సాధించినా స్నేహ రాణా ఐదు వికెట్లతో బౌలింగ్ ధాటికి భారత మహిళల జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!