Shivam Dube: ఆ ఇద్దరు వెనకుండి నడిపించారు: దూబె
- 8 మ్యాచుల్లో 133 పరుగులు
- 16 బంతుల్లోనే 27 పరుగులు
- ఫైనల్ మ్యాచ్ అత్యంత కఠిన సవాల్
- ఆ ఇద్దరు వెనకుండి నడిపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivam Dube Ract on his performance in T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు చాలా మద్దతు ఇచ్చారని టీమిండియా యువ ఆటగాడు శివమ్ దూబె తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ప్రతి మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, జట్టులోని సహచరులు అండగా నిలిచారన్నాడు. టీ20 ప్రపంచకప్ భారత జట్టు గెలవడంతో తన పాత్ర ఉండటం ఎంతో గర్వంగా ఫీలవుతున్నా అని దూబె చెప్పుకొచ్చాడు. పొట్టి టోర్నీలో దూబె 8 మ్యాచుల్లో 133 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో కీలక సమయంలో 16 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివమ్ దూబె మాట్లాడుతూ… ‘టీ20 ప్రపంచకప్ ప్రయాణం చాలా బాగుంది. ఫైనల్ మ్యాచ్ అత్యంత కఠిన సవాల్ అని చెప్పాలి. జట్టు విజయంలో నా పాత్ర ఉండటం గర్వంగా ఫీలవుతున్నా. మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. సహచరులు అండగా నిలిచారు. అభిమానులు నిరంతరం ఉత్తేజపరిచారు. ఫైనల్ మ్యాచ్లో జట్టు కోసం నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించే అవకాశం దక్కింది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నించా. టోర్నీ ఆరంభంలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచారు. నా బలమేంటో చెప్పారు. వారి మద్దతు వల్లే రాణించగలిగా. నిరంతరం నా వెనకుండి నడిపించారు. నాపై వారికున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆడా. భవిష్యత్తులోనూ జట్టు విజయాల్లో నా పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నా’ అని తెలిపాడు.
Also Read
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత జింబాబ్వేతో టీ20 సిరీస్లో శివమ్ దూబె ఆడాడు. చివరి మ్యాచ్లో 12 బంతుల్లో 26 పరుగులు చేశాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక జులై 27 నుంచి ఆరంభం అయ్యే శ్రీలంకతో సిరీస్లో అతడికి చోటు ఖాయం. నేడు బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. ఈ సిరీస్లో కూడా రాణిస్తే.. భారత టీ20 జట్టులో సుస్థిర స్థానం అవుతుంది. ఇప్పటికే రోహిత్, కోహ్లీ, జడేజాలు వీడ్కోలు పలికిన నేపథ్యంలో యువకులకు అవకాశాలు దక్కనున్నాయి.
తాజావార్తలు
-
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
-
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
-
Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
-
Astrology: కోపం త్వరగా వచ్చినా.. అంతే వేగంగా మర్చిపోయే 4 రాశులు ఇవేనా? మనసులో పగ పెట్టుకోరట!
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!