IND vs SL: యాక్షన్ మొదలెట్టిన గంభీర్.. రోహిత్కు ఫోన్! మరో ప్లేయర్పై వేటు
- హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు
- సుదీర్ఘ ప్రణాళికలు
- గంభీర్ కఠిన నిర్ణయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir does not want to make KL Rahul the India Captain: శ్రీలంక పర్యటనతో హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. కోచ్గా భారత జట్టుకు తన అత్యుత్తమ సేవలు అందించాలని గౌతీ భావిస్తున్నాడు. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్లనే లక్ష్యంగా కాకుండా.. సుదీర్ఘ ప్రణాళికలు రచించాడట. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25ను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పును సిద్ధం చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలకడంతో భారత జట్టు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపడతాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ పేరు కెప్టెన్సీ రేసులోకి వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యనే కెప్టెన్గా కొనసాగుతాడని తెలుస్తోంది. సూర్యకు గౌతమ్ గంభీర్ మద్దుతుగా నిలిచాడట. దాంతో హార్దిక్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. గంభీర్ రాకతో మరో ప్లేయర్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయని తెలుస్తోంది.
Also Read
Also Read: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. కెప్టెన్ రోహిత్ శర్మనే!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో.. శ్రీలంక పర్యటనలో కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉంటాడని అనుకున్నారు. అయితే రాహుల్ను కెప్టెన్ చేయడం గౌతమ్ గంభీర్కు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే వన్డేలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని రోహిత్ను గంభీర్ కోరాడట. అమెరికా వెళ్లిన అతడిని స్వదేశానికి తిరిగిరావాలని కోరాడట. కొత్తగా బాధ్యతలు అందుకున్న వేళ పూర్తిస్థాయి జట్టు ఉండాలని గౌతీ కోరుకోవడం మరో కారణమని తెల్సుతుంది. ఐపీఎల్ సిరీస్ సందర్భంగా గౌతమ్ లక్నో జట్టుకు మెంటార్గా వ్యవహరించగా.. రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. వారిద్దరికీ మంచి అవగాహన ఉన్నా.. రాహుల్ను సారథ్యంకు అంగీకరించకపోవడం అభిమానులను షాక్కు గురి చేస్తోంది. దీనిపై ఈరోజు క్లారిటీ రానుంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!