Gautam Gambhir: టీమిండియా అభిమానులకు శుభవార్త.. అప్పటివరకు జట్టులోనే కోహ్లీ-రోహిత్!
- టీ20 ఫార్మాట్కు కోహ్లీ గుడ్బై
- అభిమానుల్లో ఆందోళన
- క్లారిటీ ఇచ్చిన గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir about Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. తాము వన్డే, టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటామని చెప్పారు. టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇవ్వడంతో వారు ఎప్పటివరకు జట్టులో కొనసాగుతారనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్, కోహ్లీలు ఉంటారో లేదో అని ఫాన్స్ చర్చించుకున్నారు. దీనిపై టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఫిట్నెస్ ఉండి.. వారు ఆడాలనుకుంటే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులోనే కొనసాగుతారని గంభీర్ అన్నాడు.
ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. మరికొన్నాళ్ల పాటు వారు క్రికెట్ ఆడతారు. ఎలాంటి ప్లేయర్స్ ఆడాలని ఏ జట్టు అయినా కోరుకుంటుంది. ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఉంది. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. అందులో వారు తప్పక ఆడతారు. ఫిట్నెస్, ఫామ్ కాపాడుకుంటూ ఉంటే.. 2027 ప్రపంచకప్లోనూ తప్పక ఆడతారు. ఏ నిర్ణయం అయినా వారిదే’ అని అన్నాడు.
Also Read
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
Also Read: Hardik-Agarkar: అందుకే హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయలేదు: చీఫ్ సెలక్టర్ అగార్కర్
‘ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టును నడిపించేందుకు వచ్చా. భారత్ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచింది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్లలో రన్నరప్గా నిలిచింది. జట్టులోని ప్రతి ఒక్కరితో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. బీసీసీఐ కార్యదర్శి జై షా బాగా తెలుసు. సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తుంటాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా బాధ్యతలపై దృష్టిపెట్టాలి. ఇక్కడ గంభీర్ ముఖ్యం కాదు. భారత జట్టుకే మొదటి ప్రాధాన్యం’ అని గౌతమ్ గంభీర్ తెలిపాడు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!