Gautam Gambhir: టీమిండియా అభిమానులకు శుభవార్త.. అప్పటివరకు జట్టులోనే కోహ్లీ-రోహిత్!
- టీ20 ఫార్మాట్కు కోహ్లీ గుడ్బై
- అభిమానుల్లో ఆందోళన
- క్లారిటీ ఇచ్చిన గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir about Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. తాము వన్డే, టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటామని చెప్పారు. టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇవ్వడంతో వారు ఎప్పటివరకు జట్టులో కొనసాగుతారనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్, కోహ్లీలు ఉంటారో లేదో అని ఫాన్స్ చర్చించుకున్నారు. దీనిపై టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఫిట్నెస్ ఉండి.. వారు ఆడాలనుకుంటే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులోనే కొనసాగుతారని గంభీర్ అన్నాడు.
ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. మరికొన్నాళ్ల పాటు వారు క్రికెట్ ఆడతారు. ఎలాంటి ప్లేయర్స్ ఆడాలని ఏ జట్టు అయినా కోరుకుంటుంది. ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఉంది. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. అందులో వారు తప్పక ఆడతారు. ఫిట్నెస్, ఫామ్ కాపాడుకుంటూ ఉంటే.. 2027 ప్రపంచకప్లోనూ తప్పక ఆడతారు. ఏ నిర్ణయం అయినా వారిదే’ అని అన్నాడు.
Also Read
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
Also Read: Hardik-Agarkar: అందుకే హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయలేదు: చీఫ్ సెలక్టర్ అగార్కర్
‘ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టును నడిపించేందుకు వచ్చా. భారత్ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచింది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్లలో రన్నరప్గా నిలిచింది. జట్టులోని ప్రతి ఒక్కరితో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. బీసీసీఐ కార్యదర్శి జై షా బాగా తెలుసు. సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తుంటాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా బాధ్యతలపై దృష్టిపెట్టాలి. ఇక్కడ గంభీర్ ముఖ్యం కాదు. భారత జట్టుకే మొదటి ప్రాధాన్యం’ అని గౌతమ్ గంభీర్ తెలిపాడు.
తాజావార్తలు
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!