Ind vs SL 5th T20I: హర్మన్ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్… శ్రీలంకపై భారత్ 5-0 క్లీన్స్వీప్..!
Ind vs SL 5th T20I: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో ఇరుజట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు సాగింది. ఛేదన మొదట్లో భారత జట్టు కష్టాల్లో పడినా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజయాన్ని అందించింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు పోరాడినా, కీలక సమయంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి విజయం సాధించారు. దీంతో టీమిండియా సిరీస్ను 5-0తో క్లీన్స్వీప్ చేసింది.
Youth Risks Reels: మరీ ఇదేం పిచ్చిరా నాయనా..! రీల్స్ కోసం ఏకంగా..
Also Read
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలి 3 వికెట్లను కేవలం 41 పరుగులకే కోల్పోయింది. అలాగే 77 పరుగుల వద్దే సగం జట్టు పెవిలియన్ చేరింది. ఈ సమయంలో హర్మన్ప్రీత్ కౌర్ బాధ్యత తీసుకుని జట్టును ఆదుకుంది. ఆమె 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 68 పరుగులు చేశారు. ఆమెకు తోడుగా అరుంధతి రెడ్డి 11 బంతుల్లో 27 పరుగులు చేయగా, అమంజోత్ కౌర్ 21 పరుగులు జోడించారు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక బౌలింగ్లో కవిషా దిలహారి 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. రష్మిక సేవ్వండి, చమరి అటపట్టు తలా 2 వికెట్లు సాధించారు. నిమాషా మీపేజ్ 1 వికెట్ తీసింది.
సాక్షి అగర్వాల్ మ్యాజిక్.. ఈ లుక్ చూసి అందరూ ఫిదా అవ్వాల్సిందే!
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు మొదట్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ చమరి అటపట్టు కేవలం 2 పరుగులకే అవుట్ కాగా.. ఆ తర్వాత హసిని పెరెరా, ఇమేషా దులానీ అద్భుతంగా ఆడి శ్రీలంకకు ఆశలు కల్పించారు. ఇమేషా దులానీ 39 బంతుల్లో 50 పరుగులు (8 ఫోర్లు) చేయగా, హసిని పెరెరా 42 బంతుల్లో 65 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్స్) చేశారు. కానీ చివర్లో భారత బౌలర్లు కట్టడి చేయడంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ ఈ మ్యాచ్ను 15 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ మొత్తం 6 మంది బౌలర్లను వినియోగించగా.. అందరూ ఒక్కో వికెట్ తీశారు. దీప్తి శర్మకు టీ20 అంతర్జాతీయాల్లో 152వ వికెట్ తీయగా.. దీనితో ఆమె మహిళల టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించారు.
తాజావార్తలు
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!