IND vs PAK: 2023 ప్రపంచకప్ కోసం భారత్, పాకిస్థాన్ల మధ్య పోరు మొదలైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా ప్లేయింగ్-11లో ఒకే ఒక్క మార్పు చోటు చేసుకుంది. ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్మన్ గిల్ తిరిగి వచ్చాడు. మరోవైపు పాక్ జట్టులో ఎలాంటి మార్పు లేదు.
Read Also:Keerthi Suresh : హెవీ వర్కౌట్స్ తో జిమ్ లో తెగ కష్టపడుతున్న కీర్తి సురేష్..
భావోద్వేగానికి గురైన రోహిత్ శర్మ
ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్మన్ గిల్ని జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ మాట్లాడుతూ.. ‘ఇషాన్ పట్ల నాకు బాధగా ఉంది. జట్టు అతని నుండి ఏదైనా డిమాండ్ చేసినప్పుడల్లా, అతను ముందుకు వెళ్లి జట్టు కావాల్సినది నెరవేర్చాడు. అయితే గత కొన్ని నెలలుగా శుభ్మాన్ గిల్ మా కోసం చాలా బాగా రాణిస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్లో గిల్కు అవకాశం కల్పించాం’ అంటూ భావోగ్వేగానికి లోనయ్యాడు. సాయంత్రం ఈ మైదానంలో మంచు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దానిని దృష్టిలో ఉంచుకుని మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అదే సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా టాస్ గెలిచిన తర్వాత మొదట బౌలింగ్ చేయాలనుకున్నానని తెలిపాడు. అయితే ఇప్పుడు ఈ పిచ్పై భారీ స్కోరు చేయడం ప్రత్యర్థి వ్యూహాలను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. పాకిస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
రెండు జట్లలో ప్లేయింగ్-11
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్.
Read Also:Maa Oori Polimera 2 : ఆసక్తి రేకెత్తిస్తున్న మా ఊరి పొలిమేర 2 ట్రైలర్..