IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. పోలీసుల గుప్పిట్లోకి అహ్మదాబాద్! 11 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge security for India vs Pakistan Match in ICC ODI World Cup 2023: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1,32,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఈ స్టేడియంకు లక్ష మందికి పైగా ప్రేక్షకులు మ్యాచ్ చూడటానికి వస్తారని బీసీసీఐ అంచనా వేస్తోంది. దాంతో అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అహ్మదాబాద్ నగరం అంతా పోలీసుల గుప్పిట్లో ఉంది.
స్థానిక పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎన్ఎస్జీ కమాండోలతో పటిష్ట భద్రతను గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది ఉంటుందట. గత 20 ఏళ్లుగా అహ్మదాబాద్ నగరంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా ఎలాంటి మత హింస జరగలేదని.. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ దాడులను కూడా అడ్డుకునేలా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని అహ్మదాబాద్ సిటీ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Also Read: Budget Smartphones 2023: ‘బిగ్ బిలియన్ డేస్’ టాప్ డీల్స్.. అతి తక్కువ ధరకే ప్రీమియం స్మార్ట్ఫోన్స్!
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ భద్రతా ఏర్పాట్లపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వి, డీజీపీ వికాస్ సహయ్, కమిషన్ జీఎస్ మాలిక్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భద్రతపై చేర్చించారట. 150 పోలీస్ ఉన్నతాధికారులు, 7000 మంది స్థానిక పోలీసులు, ముగ్గురు డీసీపీ, 18 ఏసీపీలు, 56 ఇన్స్పెక్టర్లు, 117 మంది ఎస్ఐలు, 500 మంది హోం గార్డులతో భద్రత ఏర్పాటు చేశారట. స్టేడియం చుట్టూ 2 వేల సీసీ కెమెరాలు ఉన్నాయట. బాడీ కెమెరాలతో వెయ్యి మంది పోలీసులు ఉంటారు. స్నైపర్ టీమ్స్ కూడా ఉంటుంది. స్టేడియంలో మినీ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. అణువణువూ పర్యవేక్షిస్తున్న పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!