Rohit Sharma: సగం లక్ష్యమే పూర్తయింది.. ముందుంది అసలు పండగ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma React on India win against New Zealand: వన్డే ప్రపంచకప్ 2023లో తమ లక్ష్యం సగం మాత్రమే పూర్తయిందని, అసలు సమరం (సెమీస్, ఫైనల్) ముందుంది అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మొహ్మద్ షమీతో పాటు ఇతర బౌలర్లు న్యూజిలాండ్ను అద్భుతంగా కట్టడి చేశారన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్లు గతంలోనూ ఎన్నో వచ్చాయని రోహిత్ కొనియాడాడు. ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఆదివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ను రోహిత్ సేన ఓడించింది. భారత్ విజయంలో షమీ, కోహ్లీ, జడేజాలు కీలక పాత్ర పోషించారు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. టోర్నీలో ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ వెళుతున్నాం. ప్రపంచకప్ విజయంలో మా లక్ష్యం ఇంకా సగమే పూర్తయింది. జట్టును సమతూకంగా ఉంచడం కీలకం. తర్వాత మ్యాచ్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. మొహ్మద్ షమీ వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. షమీ లాంటి క్లాస్ బౌలర్కు ధర్మశాల వంటి పిచ్ అనుకూలంగా ఉంటుందని నిరూపించాడు. ఓ దశలో న్యూజిలాండ్ 300లకు పైగా స్కోరు చేస్తుందని అనుకున్నా. షమీ సహా ఇతర బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. అందరూ బాగా బౌలింగ్ చేశారు… ఈ విజయం బౌలర్లదే’ అని అన్నాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Mohammed Shami: ఆ వికెట్తో నాలో మరింత నమ్మకం పెరిగింది: షమీ
‘నేను నా బ్యాటింగ్ను ఎప్పుడూ ఆస్వాదిస్తా. వేర్వేరు వ్యక్తిత్వాలు గల నేను, గిల్ మాట్లాడనుకుంటూ ముందుకు వెళ్లాం. చివరకు విజయం సాధించడం ఆనందంగా ఉంది. విరాట్ కోహ్లీ గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. గత కొన్నేళ్లుగా తన ఆటతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. వికెట్స్ కోల్పోయినప్పుడు కోహ్లీ, జడేజాల భాగస్వామ్యం విజయానికి దగ్గర చేసింది. ఫీల్డింగ్లో కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. అన్నింటి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం. విభిన్న ప్రాంతాల్లో మ్యాచ్లు ఆడడాన్ని మేం ఆస్వాదిస్తున్నాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!