IND vs ENG: నేడు ఇంగ్లండ్తో మూడో వన్డే.. కింగ్ బ్యాటింగ్పై సర్వత్రా ఆసక్తి!
- నేడు భారత్, ఇంగ్లండ్ మూడో వన్డే
- మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం
- విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను చేజిక్కించుకున్న టీమిండియా.. వన్డేల్లో ఇంగ్లీష్ జట్టుపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచిన రోహిత్ సేన.. సిరీస్ క్లీన్ స్వీప్పై కన్నేసింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం చివరిదైన మూడో వన్డే ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఇది నామమాత్రమైన మ్యాచ్ అయినప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముంగిట ఆడబోతున్న చివరి వన్డే కావడంతో తేలిగ్గా తీసుకోవట్లేదు.
ఈ మ్యాచ్లో భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు లేవు. గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోకాలి వాపుతో తొలి వన్డేలో ఆడని కింగ్.. గత మ్యాచ్లో 5 పరుగులకే అవుట్ అయ్యాడు. బ్యాటింగ్కు అనుకూలించే అహ్మదాబాద్లో అయినా భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి విరాట్ ఎలా ఆడుతాడో చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగడం సానుకూలాంశం. కేఎల్ రాహుల్ నిరూపించుకోవాల్సి ఉంది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు మెరుస్తున్నారు.
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
మహ్మద్ షమీ, హర్షిత్ రాణా పేస్ బౌలింగ్ బాధ్యతలను బాగానే నిర్వర్తిస్తున్నారు. దాంతో అర్ష్దీప్ సింగ్కు మ్యాచ్లో అవకాశం రాకపోవచ్చు. అహ్మదాబాద్లో స్పిన్నర్లు కీలకం కాబట్టి వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆడనున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ అయినా గెలవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. హిట్టర్లతో నిండిన ఇంగ్లండ్ భారీగా పరుగులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. డకెట్, సాల్ట్, బట్లర్, రూట్, లివింగ్స్టన్ రాణిస్తున్నారు. బౌలింగ్లో రషీద్ ఒక్కడే రాణిస్తున్నాడు. ఆర్చర్ మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశముంది. మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్మన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, హార్దిక్, అక్షర్, జడేజా, వరుణ్ చక్రవర్తి, షమీ, హర్షిత్ రాణా.
ఇంగ్లండ్: సాల్ట్, డకెట్, బాంటన్, రూట్, బ్రూక్, బట్లర్ (కెప్టెన్), లివింగ్స్టన్, కార్స్, రషీద్, ఆర్చర్/సకిబ్, మార్క్ వుడ్.
తాజావార్తలు
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!