IND vs BAN: రోహిత్ శర్మకు గంభీర్ సందేశం.. అసలు విషయం చెప్పిన మోర్కెల్!
- రెండో టెస్టులో దూకుడుగా భారత్
- మ్యాచ్లో రోహిత్ సేన ఆధిపత్యం
- విజయం సాధించాలని చూస్తోన్న టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ దూకుడుగా ఆడుతోంది. వర్షం కారణంగా కేవలం నాలుగు సెషన్ల ఆట మాత్రమే సాగినా.. మ్యాచ్లో రోహిత్ సేన ఆధిపత్యం కొనసాగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్లో బంగ్లాను 233 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి 52 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్లో బంగ్లా ఓపెనర్లను పెవిలియన్ చేర్చింది. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 26/2గా ఉంది. బంగ్లాను త్వరగా ఆలౌట్ చేసి.. విజయం సాధించాలని టీమిండియా చూస్తోంది.
బంగ్లాదేశ్పై విజయం సాధించేందుకు భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనివెనక మాస్టర్మైండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాగా.. అమలు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ. ఆటను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలని, విజయం సాధించేందుకే ప్రయత్నించాలని రోహిత్తో గౌతీ చెప్పాడని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పాడు. కోచ్ కోరుకున్న దానిని ఆటగాళ్లు సరిగ్గా అమలు చేశారన్నాడు. బంగ్లా ఆలౌట్ అయ్యాక రోహిత్తో గంభీర్ మాట్లాడి గేమ్ ప్లాన్ చెప్పాడని మోర్కెల్ తెలిపాడు. కాన్పూర్లో 4వ రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో మోర్కెల్ మాట్లాడుతూ రోహిత్-గంభీర్ కాంబినేషన్పై ప్రశంసలు కురిపించాడు.
Also Read
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
Also Read: Team India: మంచి ‘బలగం’ ఉంది.. మరో పదేళ్లు ఢోకా లేదు: వీవీఎస్ లక్ష్మణ్
‘మ్యాచ్ను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మేం నిర్ణయించాం. జట్టును ముందుండి నడిపించాల్సిన మంచి లీడర్ కావాలి. రోహిత్ శర్మ అందుకు సరిగ్గా సరిపోతాడు. గతంలో అతడు ఇలాంటివి ఎన్నోసార్లు విజయవంతంగా చేశాడు. ఈ టెస్టులోనూ అదే పాటిస్తున్నాడు. రోహిత్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్గా మలిచి.. తమ ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పాడు. కొత్త బంతి ఎంత ప్రమాదకరమో తెలిసిందే. అయినా రోహిత్, జైస్వాల్ అదరగొట్టారు. దూకుడుగా ఆడాలంటే ముందుగా కెప్టెన్ కూడా అదే భావనతో ఉండాలి. అప్పుడే జట్టులోని ఆటగాళ్లలో స్ఫూర్తి కలుగుతుంది. ఫీల్డింగ్లోనూ రోహిత్ ప్రదర్శన అద్భుతం. జట్టులో భయం అనేది దరిచేరకుండా చేయడంలో గంభీర్తో పాటు కెప్టెన్గా రోహిత్ సఫలమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థికి తలొగ్గకూడదనే లక్ష్యంతోనే రోహిత్ ఉంటాడు’ అని మోర్నీ మోర్కెల్ అన్నాడు.
తాజావార్తలు
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!