ఆసియా కప్ 2025లో భారత్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్లపై అద్భుతమైన విజయాలు సాధించిన భారత్.. సూపర్-4లో కూడా ఆధిపత్యాన్ని చూపుతోంది. సూపర్-4లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మరోసారి జయకేతనం ఎగురవేసింది. సూపర్-4లో భారత్ ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే.. ఫైనల్ బెర్త్ దక్కనుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్లో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కీలక మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారీగా పరుగులు ఇచ్చాడు. తన కోటా 4 ఓవర్లలో ఏకంగా 45 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేదు. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్లలో 11 ఓవర్లు బౌలింగ్ చేసి.. 92 పరుగులు ఇచ్చాడు. ఆసియా కప్ 2025లో 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ నేపథ్యంలో బుమ్రా స్థానంలో టీ20 బౌలర్ అర్ష్దీప్ సింగ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు లభించవచ్చు. ఈ ఒక్క మార్పు మినహా పాకిస్తాన్పై ఆడిన ప్లేయర్స్ ఆడనున్నారు. బ్యాటింగ్లో టీమిండియాకు ఎదురులేదు. మొన్నటి వరకు విఫలమైన గిల్ కూడా ఫామ్ అందుకున్నాడు.
Also Read: Shahid Afridi: ఆ అంపైర్ ఐపీఎల్లో కూడా ఆడాలి కదా?.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అఫ్రిది!
భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.
