IND vs BAN: చెపాక్లో ఎన్నడూ చూడని దృశ్యాలు.. మరి కాన్పూర్ పిచ్ సంగతేంటి?
- 27 నుంచి రెండో టెస్టు
- సంప్రదాయ శైలిలోనే కాన్పూర్ పిచ్
- ఆల్రౌండర్ కావాలనుకుంటే అక్షర్కు ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanpur Pitch Report for India vs Bangladesh 2nd Test: సాధారణంగా చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంటుంది. స్పిన్నర్లు చెపాక్లో పండగ చేసుకుంటారు. అయితే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో మాత్రం బంతి బాగా బౌన్స్ అయింది. ఎన్నడూ లేనివిధంగా పేసర్లు ప్రమాదకరంగా మారారు. తొలి రెండు రోజులు పేసర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు పెను సవాలుగా మారింది. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఆలస్యంగా మొదలైంది. చెన్నైలో పేసర్లు అంత జోరు చూపించడం ఆటగాళ్లకే కాదు అభిమానులకూ ఆశ్చర్యాన్ని కలిగించింది. చెపాక్లో ముంబై నుంచి ఎర్రమట్టి తెచ్చి కొత్తగా ఓ పిచ్ను తయారు చేయడమే ఇందుకు కారణం. ఇక రెండో టెస్టుకు వేదిక కానున్న కాన్పూర్లో వికెట్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
రెండో టెస్టు కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు కాన్పూర్ చేరుకున్నాయి. ఇరుజట్లు గ్రీన్పార్క్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తాయి. 27న టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. కాన్పూర్ పిచ్ సంప్రదాయ శైలిలోనే స్పందిస్తుందని తెలుస్తోంది. ఎప్పట్లాగే బ్యాటర్ల హవా నడుస్తుందని, పరుగుల వరద పారుతుందట. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్ల ప్రభావం పెరుగుతుంది. కాన్పూర్లో పిచ్ నల్లమట్టితో కూడి ఉంటుంది. ఈ పిచ్పై బంతి ఎక్కువగా బౌన్స్ కాదు. దీంతో బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్ ఆడొచ్చు. అయితే మ్యాచ్ సాగేకొద్దీ బంతి బాగా తిరుగుతుంది. చివరి రెండు రోజులు స్పిన్నర్లకు సహకరిస్తుంది.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Also Read: T20 World Cup 2024: అందరూ మహిళలే.. టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్ట్ ఇదే! ఏపీ నుంచి ఒకరు
కాన్పూర్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తుది జట్టులో మార్పు చేసే అవకాశం ఉంది. తొలి టెస్టుకు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగగా.. కాన్పూర్లో ఒక పేసర్ను తగ్గించుకుని మూడో స్పిన్నర్ను ఆడించేందుకు అవకాశం ఉంది. భారత్ తరఫున ఆకాశ్ దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రావచ్చు. బ్యాటింగ్ బలోపేతం కోసం ఆల్రౌండర్ కావాలనుకుంటే అక్షర్ పటేల్ వైపు మొగ్గుచూపొచ్చు. నహిద్ రాణా స్థానంలో తైజుల్ ఇస్లామ్ను బంగ్లాదేశ్ ఆడించొచ్చు. స్పిన్ ఆల్రౌండర్ షకిబ్ అల్హసన్ ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఒకవేళ అతడు అందుబాటులో లేకుంటే.. నయీమ్ తుది జట్టులోకి వస్తాడు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!