World Cup Final 2023: ఆ ట్రెండ్ కొనసాగితే.. భారత్దే 2023 ప్రపంచకప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fans Feels India will win World Cup 2023 Trophy against Australia: భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 తుది అంకానికి చేరుకుంది. నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. బుధవారం ముంబైలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. రెండు టాప్ టీమ్స్ మధ్య ఫైనల్ కాబట్టి రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే భారత్దే 2023 ప్రపంచకప్ అని ఫాన్స్ అంటున్నారు.
ఓ ట్రెండ్ ప్రకారం భారత్దే ప్రపంచకప్ అని అభిమానులు అంటున్నారు. అదేంటంటే.. 2011 నుంచి వన్డే ప్రపంచకప్కు ఆతిథ్యమిచ్చిన దేశం టైటిల్ గెలిచింది. 2011లో మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వగా.. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్ను గెలుచుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసిన భారత్.. రెండోసారి వన్డే ప్రపంచకప్ను అందుకుంది.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు సంయుక్తంగా ప్రపంచకప్కు ఆతిథ్యమిచ్చాయి. ఫైనల్ పోరు కూడా ఈ రెండు జట్ల మధ్యే జరిగింది. అయితే ఫైనల్ ఎక్కడ జరిగిందో.. ఆ జట్టే విజేతగా నిలిచింది. 2015లో ప్రపంచకప్ ఫైనల్ మెల్బోర్న్లో జరగ్గా.. ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. 2019 ప్రపంచకప్కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వగా.. ఆ జట్టే విశ్వవిజేతగా నిలిచింది. లార్డ్స్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ టైగా కాగా.. సూపర్ ఓవర్లో కూడా టైగా ముగిసింది. దాంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.
ఇప్పుడు ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. టీమిండియా తన జోరు కొనసాగిస్తూ.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ కప్ అందుకుంటుందని ఫాన్స్ ఆశిస్తున్నారు. రోహిత్ సేన జోరు చూస్తే.. ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఇక 1975లో వన్డే ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కాగా.. మొదటి మూడుసార్లు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఆతిథ్య జట్టు టైటిల్ మాత్రం గెలవలేదు. ఎట్టకేలకు 2019 కప్ సాధించింది.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..