Mohali Pitch Report: భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే.. బ్యాటర్లకు పండగే! లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS 1st ODI Pitch Report and Live Streaming Details: స్వదేశంలో వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి వన్డే మొహాలీ వేదికగా ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత సారథిగా వ్యవహరించనున్నాడు. రోహిత్ సహా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కూడా ఈ మ్యాచ్లో లేకపోవడంతో.. పటిష్ట ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడం కష్టమే అని చెప్పాలి. అయితే మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుంది. భారత బ్యాటర్లు చెలరేగితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. నేడు జరిగే మ్యాచ్ వికెట్ను కూడా బ్యాటింగ్కు అనుకూలంగా మార్చినట్లు తెలుస్తోంది. దాంతో ఇరు జట్ల బ్యాటర్లు పండగ చేసుకోనున్నారు. గిల్, రాహుల్, ఇషాన్, స్మిత్, స్టోయినిస్, వార్నర్, గ్రీన్ లాంటి బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. నేటి వన్డేలో భారీ స్కోర్స్ నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read
- Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
ఐఎస్ బింద్రా స్టేడియంలో ఆడిన చివరి 5 మ్యాచ్లలో నాలుగు సార్లు మొదట బౌలింగ్ చేసిన జట్టే గెలిచింది. ఒక్కసారి మాత్రమే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్ భారత్ పేరిటే ఉంది. 2017 శ్రీలంకపై భారత్ 392 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (208) డబుల్ సెంచరీ బాదాడు.
మొహాలీలో గత నాలుగేళ్లుగా ఒక్క వన్డే కూడా జరగలేదు. అయితే రెండేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్లు మాత్రం జరిగాయి. ప్రతీ మ్యాచ్లోనూ బ్యాటర్లే పైచేయి సాధించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్కు ఎటువంటి వర్షసూచన లేదు. టాస్ మధ్యాహ్నం 1 గంటకు పడనుండగా.. మ్యాచ్ 1.30కి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 ఛానెల్లో ప్రసారం కానున్నాయి.
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!