Bhatti: ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం పీఆర్సీ పెంచడం దారుణం.. ఇదేనా ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం పీఆర్సీ పెంచడం దారుణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇదేనా ఉద్యోగులను కడుపులో పెట్టుకునే చూసుకునే విధానమని విమర్శించారు. దేశంలోనే ధనిక రాష్ట్రంలో ఏమిటి దారుణమని ప్రశ్నించారు. వెంటనే 20% ఐఆర్ ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న మూడు డీఏల్లో రెండు డీఏలు వెంటనే క్లియర్ చేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఏడాదిగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పే రివిజన్ కమిషన్ (PRC) ఏర్పాట్లు స్వాగతిస్తున్నామని.. అయితే ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పూర్తిగా ఖండిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Bus Accident: ఏపీలో తప్పిన పెను ప్రమాదం.. 50 మంది సేఫ్.. సినిమాను మించిన సీన్..!
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ఏడాది పీఆర్సీ గడువు ముగిసిందని.. సాధారణంగా పీఆర్సీ గడువు ముగియడానికి ఆరు నెలల ముందే కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తెప్పించాల్సి ఉంటుందని భట్టి పేర్కొన్నారు. గడువు ముగిసిన మూడు నెలల తర్వాత పీఆర్సీ కమిటీలు ఏర్పాటు చేయడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ఎన్నికల ముందు ప్రకటించిన IR దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఈ ఐఆర్ ను ఉద్యోగులు ఎన్నడు చూడలేదన్నారు. ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసే పీఆర్సీలో ఈ శాతం దారుణంగా ఉందని భట్టి తెలిపారు.
Prabhas: రేయ్.. రేయ్.. ఎవర్రా ఆ పిల్ల.. ప్రభాస్ నే చెంప మీద కొట్టి అట్టా పారిపోయింది..
రాష్ట్రంలోని సుమారు 2.75 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, 2 లక్షల మంది పెన్షనర్లు పీఆర్సీని చూసి ఆశ్చర్యానికి గురయ్యారని భట్టి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించిన IR సవరించాలని.. 20% IR వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. పెండింగ్ లో ఉన్న మూడు డీఏల్లో రెండింటిని వెంటనే క్లియర్ చేయాలన్నారు. ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని భట్టి విక్కమార్క తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!