Arasavilli Aravind Charitable Trust: అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ కేంద్రంగా అరసవిల్లి అరవింద్ సారథ్యంలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్లో కోవిడ్ సమయంలో చికిత్సలు, అన్న దానాలు, మెడికల్ సేవలు, మంచి నీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నందుగల మందడం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాల భవనంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని.. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని నిన్న బాపట్ల ఎంపీ, లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నందిగం సురేష్ ప్రారంభించారు. అనంతరం ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. ట్రస్ట్ వారు స్కూల్ భవన విషయం తెలియగానే భవన నిర్మాణానికై స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. కావలిసిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ట్రస్ట్ వారిని అభినందించారు.
Read Also: Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్పై అక్కసు..
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
అనంతరం ట్రస్ట్ కోశాధికారి అరసవిల్లి రమేష్ మాట్లాడుతూ.. విద్యను మించిన ధనం ఉండదని, విద్య ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని అన్నారు. స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే అది సాధ్యం అని తెలిపారు. భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే తాము ఈ భవన నిర్మాణం చేపట్టామని.. ఇటువంటి సేవ కార్యక్రమాలకు తాము ఎప్పుడూ వెనుకాడమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత, మేకతోటి దయాసాగర్ దంపతులకు, ఎంపీ నందిగం సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ.. అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్టు ద్వారా మరిన్ని సేవలు చేయటానికి వెనకడబోమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరి అరసవిల్లి పద్మావతి దేవి, ఎక్సల్ల సంస్థ C.E.O సౌజన్య రాసంశెట్టి, ట్రస్ట్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!