Arasavilli Aravind Charitable Trust: అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ కేంద్రంగా అరసవిల్లి అరవింద్ సారథ్యంలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్లో కోవిడ్ సమయంలో చికిత్సలు, అన్న దానాలు, మెడికల్ సేవలు, మంచి నీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నందుగల మందడం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాల భవనంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని.. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని నిన్న బాపట్ల ఎంపీ, లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నందిగం సురేష్ ప్రారంభించారు. అనంతరం ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. ట్రస్ట్ వారు స్కూల్ భవన విషయం తెలియగానే భవన నిర్మాణానికై స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. కావలిసిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ట్రస్ట్ వారిని అభినందించారు.
Read Also: Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్పై అక్కసు..
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
అనంతరం ట్రస్ట్ కోశాధికారి అరసవిల్లి రమేష్ మాట్లాడుతూ.. విద్యను మించిన ధనం ఉండదని, విద్య ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని అన్నారు. స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే అది సాధ్యం అని తెలిపారు. భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే తాము ఈ భవన నిర్మాణం చేపట్టామని.. ఇటువంటి సేవ కార్యక్రమాలకు తాము ఎప్పుడూ వెనుకాడమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత, మేకతోటి దయాసాగర్ దంపతులకు, ఎంపీ నందిగం సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ.. అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్టు ద్వారా మరిన్ని సేవలు చేయటానికి వెనకడబోమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరి అరసవిల్లి పద్మావతి దేవి, ఎక్సల్ల సంస్థ C.E.O సౌజన్య రాసంశెట్టి, ట్రస్ట్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?