Arasavilli Aravind Charitable Trust: అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ కేంద్రంగా అరసవిల్లి అరవింద్ సారథ్యంలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్లో కోవిడ్ సమయంలో చికిత్సలు, అన్న దానాలు, మెడికల్ సేవలు, మంచి నీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నందుగల మందడం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాల భవనంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని.. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని నిన్న బాపట్ల ఎంపీ, లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నందిగం సురేష్ ప్రారంభించారు. అనంతరం ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. ట్రస్ట్ వారు స్కూల్ భవన విషయం తెలియగానే భవన నిర్మాణానికై స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. కావలిసిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ట్రస్ట్ వారిని అభినందించారు.
Read Also: Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్పై అక్కసు..
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
అనంతరం ట్రస్ట్ కోశాధికారి అరసవిల్లి రమేష్ మాట్లాడుతూ.. విద్యను మించిన ధనం ఉండదని, విద్య ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని అన్నారు. స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే అది సాధ్యం అని తెలిపారు. భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే తాము ఈ భవన నిర్మాణం చేపట్టామని.. ఇటువంటి సేవ కార్యక్రమాలకు తాము ఎప్పుడూ వెనుకాడమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత, మేకతోటి దయాసాగర్ దంపతులకు, ఎంపీ నందిగం సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ.. అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్టు ద్వారా మరిన్ని సేవలు చేయటానికి వెనకడబోమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరి అరసవిల్లి పద్మావతి దేవి, ఎక్సల్ల సంస్థ C.E.O సౌజన్య రాసంశెట్టి, ట్రస్ట్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
-
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
-
Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’
-
Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!