Arasavilli Aravind Charitable Trust: అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ కేంద్రంగా అరసవిల్లి అరవింద్ సారథ్యంలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్లో కోవిడ్ సమయంలో చికిత్సలు, అన్న దానాలు, మెడికల్ సేవలు, మంచి నీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నందుగల మందడం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాల భవనంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని.. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని నిన్న బాపట్ల ఎంపీ, లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నందిగం సురేష్ ప్రారంభించారు. అనంతరం ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. ట్రస్ట్ వారు స్కూల్ భవన విషయం తెలియగానే భవన నిర్మాణానికై స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. కావలిసిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ట్రస్ట్ వారిని అభినందించారు.
Read Also: Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్పై అక్కసు..
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
అనంతరం ట్రస్ట్ కోశాధికారి అరసవిల్లి రమేష్ మాట్లాడుతూ.. విద్యను మించిన ధనం ఉండదని, విద్య ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని అన్నారు. స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే అది సాధ్యం అని తెలిపారు. భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే తాము ఈ భవన నిర్మాణం చేపట్టామని.. ఇటువంటి సేవ కార్యక్రమాలకు తాము ఎప్పుడూ వెనుకాడమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత, మేకతోటి దయాసాగర్ దంపతులకు, ఎంపీ నందిగం సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ.. అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్టు ద్వారా మరిన్ని సేవలు చేయటానికి వెనకడబోమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరి అరసవిల్లి పద్మావతి దేవి, ఎక్సల్ల సంస్థ C.E.O సౌజన్య రాసంశెట్టి, ట్రస్ట్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!