Rajasthan:పెళ్లైన 10 నెలలకే భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. కారణం?
- రాజస్థాన్లో దారుణం
- కుటుంబ కలహాల కారణంగా భర్తను చంపిన భార్య
- తన తల్లితో కలిసి భర్తపై కత్తితో దాడి
- చికిత్స పొందుతూ భర్త మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. కోటా నగరంలోని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా భార్య తన భర్తపై కత్తితో దాడి చేసింది. కడుపులో బలమైన గాయం కావడంతో భర్త రక్తపు మడుగులో పడ్డాడు. అతన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. వీరిద్దరికీ 10 నెలల క్రితమే వివాహమైంది. యువకుడి కుటుంబ సభ్యులు యువతిపై, ఆమె తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అత్తమామలతో కలిసి జీవిస్తున్న షారుక్..
వివాహమైనప్పటి నుంచి షారుక్ తన అత్తమామలతో కలిసి జీవిస్తున్నాడని అతని సోదరుడు తెలిపాడు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. 10 నెలల క్రితం షారుక్ కి వివాహం అయ్యింది. అతనికి కుమారుడు కూడా ఉన్నాడు. నవంబర్ 8వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో షారుక్ తన ఇంటికి వచ్చాడు. చాలా విచారంగా కనిపించడంతో ఏం జరిగిందని ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల సమయంలో భార్య నజ్మీన్, అత్త కలిసి తన కడుపుపై కత్తితో దాడి చేశారని తెలిపాడు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు చెప్పాడు. కడుపుకు పెద్ద కట్టు కూడా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడి వెంటనే షారుక్ను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అక్కడ అతడికి ఆపరేషన్ జరిగింది. చికిత్స పొందుతున్న బాధితుడు నిన్న రాత్రి 10.30 గంటలకు మరణించాడు.
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
ఘటనపై పోలీసులు ఏం చెప్పారు?
బాధితుడు విజ్ఞాన్ నగర్ ఛత్రపుర చెరువులో నివాసం ఉంటున్న 30 ఏళ్ల షారుక్ అని సీఐ పుష్పేంద్ర తెలిపారు. లోడింగ్ ఆటో నడుపుతూ ఉండేవాడని చెప్పారు. కుటుంబ కలహాలతో భార్య నజ్మీన్ కత్తితో దాడి చేసిందన్నారు. గత వారం రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారని.. నిన్న రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. భర్త కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లడంతో భార్య ఆగ్రహం వ్యక్తం చేసిందని అందుకే కత్తితో పొడిచిందని తెలిపారు. బాధిత కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!