Rajasthan:పెళ్లైన 10 నెలలకే భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. కారణం?
- రాజస్థాన్లో దారుణం
- కుటుంబ కలహాల కారణంగా భర్తను చంపిన భార్య
- తన తల్లితో కలిసి భర్తపై కత్తితో దాడి
- చికిత్స పొందుతూ భర్త మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. కోటా నగరంలోని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా భార్య తన భర్తపై కత్తితో దాడి చేసింది. కడుపులో బలమైన గాయం కావడంతో భర్త రక్తపు మడుగులో పడ్డాడు. అతన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. వీరిద్దరికీ 10 నెలల క్రితమే వివాహమైంది. యువకుడి కుటుంబ సభ్యులు యువతిపై, ఆమె తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అత్తమామలతో కలిసి జీవిస్తున్న షారుక్..
వివాహమైనప్పటి నుంచి షారుక్ తన అత్తమామలతో కలిసి జీవిస్తున్నాడని అతని సోదరుడు తెలిపాడు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. 10 నెలల క్రితం షారుక్ కి వివాహం అయ్యింది. అతనికి కుమారుడు కూడా ఉన్నాడు. నవంబర్ 8వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో షారుక్ తన ఇంటికి వచ్చాడు. చాలా విచారంగా కనిపించడంతో ఏం జరిగిందని ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల సమయంలో భార్య నజ్మీన్, అత్త కలిసి తన కడుపుపై కత్తితో దాడి చేశారని తెలిపాడు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు చెప్పాడు. కడుపుకు పెద్ద కట్టు కూడా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడి వెంటనే షారుక్ను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అక్కడ అతడికి ఆపరేషన్ జరిగింది. చికిత్స పొందుతున్న బాధితుడు నిన్న రాత్రి 10.30 గంటలకు మరణించాడు.
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
ఘటనపై పోలీసులు ఏం చెప్పారు?
బాధితుడు విజ్ఞాన్ నగర్ ఛత్రపుర చెరువులో నివాసం ఉంటున్న 30 ఏళ్ల షారుక్ అని సీఐ పుష్పేంద్ర తెలిపారు. లోడింగ్ ఆటో నడుపుతూ ఉండేవాడని చెప్పారు. కుటుంబ కలహాలతో భార్య నజ్మీన్ కత్తితో దాడి చేసిందన్నారు. గత వారం రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారని.. నిన్న రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. భర్త కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లడంతో భార్య ఆగ్రహం వ్యక్తం చేసిందని అందుకే కత్తితో పొడిచిందని తెలిపారు. బాధిత కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!