Rajasthan:పెళ్లైన 10 నెలలకే భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. కారణం?
- రాజస్థాన్లో దారుణం
- కుటుంబ కలహాల కారణంగా భర్తను చంపిన భార్య
- తన తల్లితో కలిసి భర్తపై కత్తితో దాడి
- చికిత్స పొందుతూ భర్త మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. కోటా నగరంలోని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా భార్య తన భర్తపై కత్తితో దాడి చేసింది. కడుపులో బలమైన గాయం కావడంతో భర్త రక్తపు మడుగులో పడ్డాడు. అతన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. వీరిద్దరికీ 10 నెలల క్రితమే వివాహమైంది. యువకుడి కుటుంబ సభ్యులు యువతిపై, ఆమె తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అత్తమామలతో కలిసి జీవిస్తున్న షారుక్..
వివాహమైనప్పటి నుంచి షారుక్ తన అత్తమామలతో కలిసి జీవిస్తున్నాడని అతని సోదరుడు తెలిపాడు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. 10 నెలల క్రితం షారుక్ కి వివాహం అయ్యింది. అతనికి కుమారుడు కూడా ఉన్నాడు. నవంబర్ 8వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో షారుక్ తన ఇంటికి వచ్చాడు. చాలా విచారంగా కనిపించడంతో ఏం జరిగిందని ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల సమయంలో భార్య నజ్మీన్, అత్త కలిసి తన కడుపుపై కత్తితో దాడి చేశారని తెలిపాడు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు చెప్పాడు. కడుపుకు పెద్ద కట్టు కూడా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడి వెంటనే షారుక్ను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అక్కడ అతడికి ఆపరేషన్ జరిగింది. చికిత్స పొందుతున్న బాధితుడు నిన్న రాత్రి 10.30 గంటలకు మరణించాడు.
Also Read
ఘటనపై పోలీసులు ఏం చెప్పారు?
బాధితుడు విజ్ఞాన్ నగర్ ఛత్రపుర చెరువులో నివాసం ఉంటున్న 30 ఏళ్ల షారుక్ అని సీఐ పుష్పేంద్ర తెలిపారు. లోడింగ్ ఆటో నడుపుతూ ఉండేవాడని చెప్పారు. కుటుంబ కలహాలతో భార్య నజ్మీన్ కత్తితో దాడి చేసిందన్నారు. గత వారం రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారని.. నిన్న రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. భర్త కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లడంతో భార్య ఆగ్రహం వ్యక్తం చేసిందని అందుకే కత్తితో పొడిచిందని తెలిపారు. బాధిత కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!