IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ఆటగాళ్లు ఎవరంటే
- ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం
- అత్యధిక ధర పలికిన టాప్ 10 ఆటగాళ్లు
- టాప్ ప్లేస్ లో రిషబ్ పంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగుతోంది. మొదటి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేయగా, ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ను టైటిల్కు తీసుకెళ్లిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రూ.26 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కింగ్స్లో చేరాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయ్యర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ మధ్య చాలా సేపు పోటీ జరిగింది. కానీ, చివరికి పంజాబ్ గెలిచింది. ఐపీఎల్ 2025 వేలంలో మొదటి బిడ్ అర్ష్దీప్ సింగ్పై జరిగింది. అతడిని కొనుగోలు చేసేందుకు 6 ఫ్రాంచైజీలు వేలం వేసాయి. హైదరాబాద్ అత్యధికంగా రూ.18 కోట్లకు బిడ్ చేసినప్పటికీ, పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం)ని ఉపయోగించి అతడిని రూ.18 కోట్లకు తమ జట్టులోకి చేర్చుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పిన్నర్గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. పంజాబ్ అతడిని రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. మార్క్యూ ప్లేయర్ల జాబితాలో ఏడుగురు భారత ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ.126 కోట్లు వెచ్చించింది. ఇకపోతే ఆదివారం జరిగిన వేలంలో అత్యధికంగా ధర పలికిన టాప్ 10 ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉంది.
Also Read: Rashmika Mandanna: అదేంటి రష్మిక పెళ్లి గురించి అలా అనేసింది!
Also Read
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
1. రిషబ్ పంత్ – లక్నో సూపర్ జెయింట్స్ – రూ.27 కోట్లు
2. శ్రేయాస్ అయ్యర్ – పంజాబ్ కింగ్స్ – రూ.26.5కోట్లు
3. వెంకటేష్ అయ్యర్ – కోల్కతా నైట్ రైడర్స్ – రూ. 23.75 కోట్లు
4. అర్ష్దీప్ సింగ్ – పంజాబ్ కింగ్స్ (RTM) – రూ.18కోట్లు
5. యుజ్వేంద్ర చాహల్ – పంజాబ్ కింగ్స్ – రూ.18కోట్లు
6. జోస్ బట్లర్ – గుజరాత్ టైటాన్స్ – రూ.15.75కోట్లు
7. కేఎల్ రాహుల్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.14కోట్లు
8. మహ్మద్ సిరాజ్ – గుజరాత్ టైటాన్స్ – రూ. రూ.12.25కోట్లు
9. మిచెల్ స్టార్క్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.11.75కోట్లు.
10. ఇషాన్ కిషన్ – సన్రైజర్స్ హైదరాబాద్ – రూ.11.25 కోట్లు.
Also Read: IPL 2025 Auction: తొలిరోజు వేలం తర్వాత 10 జట్ల వద్ద మిగిలిన పర్సు విలువలు..
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!