IND vs PAK: భారత్, పాకిస్థాన్లను వేర్వేరు గ్రూపుల్లో వేయండి.. లేదా హాస్పిటల్ బిల్లులైన చెల్లించండి!
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పాక్ అభిమాని వీడియో.
- ఐసీసీకి తన బాధను వ్యక్తం చేసిన వ్యక్తి.
- భారత్, పాకిస్థాన్లను వేర్వేరు గ్రూపుల్లో వేయండి.. లేదా హాస్పిటల్ బిల్లులైన చెల్లించండంటూ వీడియో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తన విజయయాత్రను కొనసాగించింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని 241 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్ధేశించింది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఈ లక్ష్యాన్ని కేవలం 42.3 ఓవర్లలోనే సులభంగా ఛేదించింది. చివరి పరుగులను విరాట్ కోహ్లీ కొట్టి సెంచరీ సాధించడంతో భారత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
Read Also: SLBC Tunnel Collapse: 72 గంటలు గడుస్తున్నా.. 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ!
Also Read
- Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- Mohammed Siraj: కొలంబోలో 'డీఎస్పీ సాబ్' రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
- Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
అయితే, ఈ ఓటమితో పాకిస్థాన్ అధికారికంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించలేదు. కానీ, సెమీ ఫైనల్స్ అవకాశాలు మాత్రం ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే -1.087 నెట్ రన్ రేట్తో ఇబ్బందిలో ఉన్న పాకిస్థాన్, న్యూజిలాండ్ను ఓడించేందుకు భారత్, బంగ్లాదేశ్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, ఓ ఓటమితో పాకిస్థాన్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పాకిస్థాన్ అభిమాని ఐసీసీని ఉద్దేశించి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత జట్టుతో ప్రతిసారీ ఒకే గ్రూప్లో ఉంచి మళ్లీ మళ్లీ పరాజయాన్ని తలపెట్టొద్దని, ఇలా చేయడం తమకు మానసిక క్షోభ కలిగిస్తోందని అతను వ్యాఖ్యానించాడు.
Read Also: Earthquake : కోల్ కతాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో నమోదు
అంతేకూండా.. ప్రియమైన ఐసీసీ, నా నుండి మీకు ఒక అభ్యర్థన ఉందంటూ.. దయచేసి ప్రతి టోర్నమెంట్లో భారత్, పాకిస్థాన్ జట్లను వేర్వేరు గ్రూప్ల్లో ఉంచండి. ఈ ఓటమిల అవమానాన్ని భరించలేక మేము మానసికంగా కుంగిపోతున్నాం అంటూ సిద్దిక్ అనే పాక్ అభిమాని తన ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ల ద్వారా డబ్బు సంపాదించడమే మీ లక్ష్యమైతే, కనీసం ఆ ఆదాయంలో కొంత భాగాన్ని మాకు ఇచ్చి మంచి హాస్పిటల్లో చికిత్స పొందే అవకాశం కల్పించండని అభ్యర్థించాడు. ఇలా ప్రతిసారి ఓడిపోయిన అవమానం.. మాకు భరించలేని స్థాయికి చేరిందంటూ కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ పెద్దెతున్న కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
"Another Salana Bezati"
"Dear ICC,
As a fan of Pakistan, I humbly request that plz consider separating Pakistan and India into different groups. We're tired of facing defeats and humiliation on yearly Basis. If that's not possible, could you at least give Pakistan fans a share… pic.twitter.com/E7vgT2tl1j
— ٰImran Siddique (@imransiddique89) February 23, 2025
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!