Caste Conflict Case: సంచలనం.. ఒకేసారి 98 మంది దోషులకు జీవిత ఖైదు
- కుల సంఘర్షణ కేసులో..
- కర్ణాటకలోని కొప్పల్ జిల్లా సెషన్స్ కోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు..
- ఒకేసారి 98 మంది దోషులకు జీవిత ఖైదు.
- ముగ్గురు వ్యక్తులకు ఐదేళ్ల జైలు శిక్ష.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caste Conflict Case: కుల సంఘర్షణ కేసులో కర్ణాటకలోని కొప్పల్ జిల్లా, సెషన్స్ కోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పదేళ్ల క్రితం గంగావతి తాలూకా మారుకుంబి గ్రామంలో జరిగిన కుల సంఘర్షణ కేసులో 101 మంది దోషులకు గాను 98 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు నిందితులందరికీ రూ.5 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. ఈ కేసు కొప్పల్ జిల్లా గంగావతి తాలూకా మారుకుంబిలో 28 అక్టోబర్ 2014న జరిగిన కుల ఘర్షణకు సంబంధించినది. ఈ మేరకు కొప్పల్ కోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్ కుల సంఘర్షణ కేసులో 101 మందికి శిక్ష పడడం దేశంలోనే ఇదే తొలిసారి అని సమాచారం.
Read Also: Governor Jishnu Dev Sharma: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన..
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
101 మంది నిందితులపై అభియోగాలు కోర్టులో రుజువయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కేసులో షెడ్యూల్డ్ కులం, తెగకు చెందిన వారు కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులకు కుల దూషణ కేసు వర్తించదు. అందుకే 101 మందిలో ఈ ముగ్గురు దోషులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధించబడింది. అయితే అల్లర్లకు పాల్పడినందుకు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
Read Also: INDW vs NZW: న్యూజిలాండ్తో తొలి వన్డే.. భారత్ ఘన విజయం!
2014లో కొప్పల్ జిల్లా మారుకుంబి గ్రామంలో దళితులను బార్బర్ షాపులు, హోటళ్లలోకి రానివ్వడం లేదంటూ కుల గొడవ జరిగింది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తరువాత అక్కడ మరొక కేసు నమోదు చేయబడింది. మర్కుంబి పక్కనే ఉన్న గంగావతి గ్రామంలో కొందరు అగ్రవర్ణాల వారు సినిమా చూడటానికి వెళ్లారు. అక్కడ కొందరు దళిత యువకులు సినిమాను చూడడానికి వెళ్లగా గొడవ జరిగింది. ఈ కారణంగా మర్కుంబి గ్రామంలో దళితుల గుడిసెలకు అగ్రవర్ణాలు రాత్రి నిప్పు పెట్టారు. ఈ కేసులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు 101 మందిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!