Caste Conflict Case: సంచలనం.. ఒకేసారి 98 మంది దోషులకు జీవిత ఖైదు
- కుల సంఘర్షణ కేసులో..
- కర్ణాటకలోని కొప్పల్ జిల్లా సెషన్స్ కోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు..
- ఒకేసారి 98 మంది దోషులకు జీవిత ఖైదు.
- ముగ్గురు వ్యక్తులకు ఐదేళ్ల జైలు శిక్ష.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caste Conflict Case: కుల సంఘర్షణ కేసులో కర్ణాటకలోని కొప్పల్ జిల్లా, సెషన్స్ కోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పదేళ్ల క్రితం గంగావతి తాలూకా మారుకుంబి గ్రామంలో జరిగిన కుల సంఘర్షణ కేసులో 101 మంది దోషులకు గాను 98 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు నిందితులందరికీ రూ.5 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. ఈ కేసు కొప్పల్ జిల్లా గంగావతి తాలూకా మారుకుంబిలో 28 అక్టోబర్ 2014న జరిగిన కుల ఘర్షణకు సంబంధించినది. ఈ మేరకు కొప్పల్ కోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్ కుల సంఘర్షణ కేసులో 101 మందికి శిక్ష పడడం దేశంలోనే ఇదే తొలిసారి అని సమాచారం.
Read Also: Governor Jishnu Dev Sharma: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన..
Also Read
- 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
101 మంది నిందితులపై అభియోగాలు కోర్టులో రుజువయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కేసులో షెడ్యూల్డ్ కులం, తెగకు చెందిన వారు కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులకు కుల దూషణ కేసు వర్తించదు. అందుకే 101 మందిలో ఈ ముగ్గురు దోషులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధించబడింది. అయితే అల్లర్లకు పాల్పడినందుకు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
Read Also: INDW vs NZW: న్యూజిలాండ్తో తొలి వన్డే.. భారత్ ఘన విజయం!
2014లో కొప్పల్ జిల్లా మారుకుంబి గ్రామంలో దళితులను బార్బర్ షాపులు, హోటళ్లలోకి రానివ్వడం లేదంటూ కుల గొడవ జరిగింది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తరువాత అక్కడ మరొక కేసు నమోదు చేయబడింది. మర్కుంబి పక్కనే ఉన్న గంగావతి గ్రామంలో కొందరు అగ్రవర్ణాల వారు సినిమా చూడటానికి వెళ్లారు. అక్కడ కొందరు దళిత యువకులు సినిమాను చూడడానికి వెళ్లగా గొడవ జరిగింది. ఈ కారణంగా మర్కుంబి గ్రామంలో దళితుల గుడిసెలకు అగ్రవర్ణాలు రాత్రి నిప్పు పెట్టారు. ఈ కేసులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు 101 మందిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!