NTV Telugu Site icon

UK: పిల్లలు, యువకులపై దుండగుడు కత్తితో దాడి.. ముగ్గురు మృతి

Uk

Uk

బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్ నగరంలో మంగళవారం హింస చెలరేగింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు బాలికలను చంపినందుకు నిరసనగా ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దాడి ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు.. యువకులపై 17 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా, మరో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.

Read Also: Paris Olympics 2024: ఫైనల్కు స్పప్నిల్ కుసాలే.. ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు పీవీ సింధు..

మీడియా నివేదికల ప్రకారం.. దాడి చేసిన యువకుడు ముస్లిం మతానికి చెందినవాడని తెలిసింది. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి మసీదుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు దహన ఘటనలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ‘మా దేశం తిరిగి రావాలి’ అంటూ నినాదాలు చేశారు. సౌత్‌పోర్ట్‌లో జరిగిన హింసాకాండపై బ్రిటన్‌ ప్రధాని కైర్‌ స్టార్‌మర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాలికలను హత్య చేసిన నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండటం గమనార్హం. నిందితుడి దాడిని ఉగ్రవాద ఘటనగా పరిగణించేందుకు బ్రిటన్ పోలీసులు నిరాకరించారు. కాగా.. నిందితుడు బ్రిటన్‌లో పుట్టాడని, దాడి వెనుక కారణం ఇంకా వెల్లడించలేదు.

Read Also: AP Government: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం!

సోమవారం వేసవి సెలవుల సందర్భంగా సౌత్‌పోర్ట్‌లో ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ యోగా.. డ్యాన్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలికలపై దాడి చేసిన వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. టేలర్ స్విఫ్ట్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడిలో మృతి చెందిన చిన్నారులకు ఆయన నివాళులు అర్పించారు.