Imran Khan: జిన్నా ఇంటిపై దాడి కేసు.. ఇమ్రాన్ఖాన్కు సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: మే 9న లాహోర్లోని చారిత్రాత్మక కార్ప్స్ కమాండర్ హౌస్ లేదా జిన్నా హౌస్పై జరిగిన హింసాత్మక దాడిపై దర్యాప్తు చేస్తున్న సంయుక్త దర్యాప్తు బృందం మంగళవారం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పిలిపించింది. లాహోర్లోని ఖిల్లా గుజ్జర్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో సాయంత్రం 4 గంటలకు సంయుక్త దర్యాప్తు బృందం(JIT) ముందు హాజరు కావాలని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఖాన్ను కోరారు. దాడికి వ్యతిరేకంగా సర్వర్ రోడ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనను విచారణకు పిలిచారు.
మే 9న మాజీ ప్రధాని ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో జిన్నా హౌస్ (కార్ప్స్ కమాండర్ హౌస్)ను కాల్చివేసారు. మే 9న పెద్ద సంఖ్యలో పీటీఐ పార్టీ కార్యకర్తలు జిన్నా హౌస్లోకి చొరబడి దానిని ధ్వంసం చేసిన తర్వాత నిప్పంటించారు. మే 9న లాహోర్లోని జిన్నా హౌస్, అస్కారీ కార్పొరేట్ టవర్పై జరిగిన కాల్పుల దాడులపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త దర్యాప్తు బృందం (JIT) మంగళవారం ఖాన్ను పిలిపించింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు జరగగానే నిరసనలు ప్రారంభమయ్యాయి. పౌర, సైనిక సంస్థలపై దాడుల తర్వాత భద్రతా దళాలు పార్టీకి వ్యతిరేకంగా అణిచివేత ప్రారంభించాయి. దేశంలో హింసాత్మక నిరసనల్లో కనీసం ఎనిమిది మంది మరణించారు.హింసాత్మక నిరసనకారులు ఖాన్ స్వస్థలమైన పంజాబ్లోని మియాన్వాలి జిల్లాలో ఒక స్టాటిక్ విమానాన్ని తగులబెట్టారు. ఫైసలాబాద్లోని ఐఎస్ఐ భవనంపై దాడి చేశారు. రావల్పిండిలోని ఆర్మీ హెడ్క్వార్టర్స్పై (జీహెచ్క్యూ) ఒక్కసారిగా మూక దాడి చేసింది. పోలీసుల ప్రకారం, రెండు రోజుల హింసాత్మక నిరసనల సమయంలో డజనుకు పైగా సైనిక స్థాపనలు ధ్వంసం చేయబడ్డాయి లేదా కాల్చబడ్డాయి.
Also Read
Read Also: Go Air: పైలట్లను కాపాడుకునే పనిలో గో ఎయిర్.. నెల వారీ జీతం రూ.లక్ష పెంపు
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి) కమ్రాన్ ఆదిల్ నేతృత్వంలోని సంయుక్త దర్యాప్తు బృందం, మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సాయంత్రం 4 గంటలకు దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మే 9 అల్లర్లకు సంబంధించి జిట్ ఇమ్రాన్ఖాన్ను ప్రశ్నించనుంది. మే 9న సైన్యం “బ్లాక్ డే”గా పిలిచే దాడులు, హింసాత్మక నిరసనలపై దర్యాప్తు చేయడానికి పంజాబ్ హోం శాఖ 10 వేర్వేరు సంయుక్త దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. పదవీచ్యుతుడైన ప్రధాని ప్రావిన్స్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు చేయబడిన అనేక ఎఫ్ఐఆర్లలో నామినేట్ అయ్యారని నివేదిక పేర్కొంది. జిట్ నుంచి నోటీసు అందుకున్న తర్వాత, ఇమ్రాన్ ఖాన్ తన న్యాయ బృందంతో సంప్రదింపులు జరిపారు. అయితే పీటీఐ ఛైర్మన్ దర్యాప్తు సంస్థ ముందు హాజరవుతారా లేదా అనేది ఇంకా నిర్ణయించబడలేదు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..