Health Tips: ఈ ఒక్కటి చేస్తే నిత్య యవ్వనమే.. కనీసం అరగంట చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో అందరు బిజీబిజీ జీవితాలతో గడుపుతున్నారు. మనశాంతిగా తమ కుటుంబాలతో గడపలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ టెన్షన్ లైఫ్ లో ఆఫీసుకు వెళ్లడం, లేదంటే ఇంకేదైనా పనికి వెళ్లి రావడమే సరిపోతుంది. ఎక్కువ శాతం మనుషులు.. కూర్చొని చేసే జాబ్లను ఎంచుకుంటారు. దీంతో ఎప్పుడు కూర్చీకి అతుక్కునిపోయి ఉండటమే. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే అలా కాకుండా.. కనీసం ఒక గంట కూర్చుంటే 5 నిమిషాలైనా లేచి నడువాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యం ప్రతిరోజు వ్యాయామం కచ్చితంగా చేయాలని చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 70 సంవత్సరాల వయసు దాటినవారు ప్రతిరోజు నడవడంవల్ల గుండెపోటు ప్రమాదాలకు దూరంగా ఉంటారని తేలింది.
Konda Surekha: కొండా సురేఖకు రోడ్డు ప్రమాదం.. కన్నీళ్లు పెట్టుకున్న కొండా మురళీ
Also Read
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
వాకింగ్ ఆరోగ్యానికి మంచిది
ప్రతిరోజూ నడవడం చాలా మంచిది. ఎన్ని ఎక్కువ అడుగులు నడిస్తే అంత ఆరోగ్యమని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ 4500 అడుగులు నడిచేవారిలో వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుందంటున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో సమర్పించిన ఒక అధ్యయనంలో.. అదనంగా 500 అడుగులు నడవడం వల్ల గుండె వ్యాధుల్లో 14 శాతం తగ్గింపు కనపడుతోంది. ప్రతిరోజు 500 అడుగులు నడిస్తే గుండె ఆరోగ్యం బాగుంటుంది.
కనీసం అరగంట
ప్రతిరోజూ కనీసం ఒక అరగంట పాటు నడిస్తే.. బరువు తగ్గుతారు. అంతేకాకుండా.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నడకతో స్ట్రోక్ సమస్యలను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 30 నిమిషాలు నడవడం వల్ల రోజు మొత్తం చురుగ్గా ఉంటారు.
నిత్య యవ్వనం
రోజూ నడవడంవల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. మానసిక స్థితిని మెరుగుపరచడానికి, డిప్రెషన్ లక్షణాలను దూరం చేయడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. నడకతో మనిషి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది అల్జీమర్స్, ఇతర డిమెన్షియాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యం యవ్వనంగా కనిపించాలంటే ప్రతిరోజు అరగంట తక్కువ కాకుండా నడుస్తుండాలి.
తాజావార్తలు
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!