Amaravati: ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. 20,494 ఎకరాలు సమీకరణ
- ఇవాళ్టి నుంచి ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్..
- పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 7 గ్రామాల్లో భూ సమీకరణ..
- 20,494 ఎకరాలు సమీకరించనున్న ప్రభుత్వం..
- ల్యాండ్ పూలింగ్ పై రైతులకు అవగాహన కల్పించనున్న ప్రభుత్వం..
- రైల్వే స్టేషన్, ఇన్రర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ కోసం భూ సమీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. తొలి రోజు వడ్డమాను, యండ్రాయి గ్రామాల్లో భూ సమీకరణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొంటారు. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి సీఆర్డీఏ (CRDA) అధికారులు నేటి నుంచి రైతులను కలిసి అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. భూ సమీకరణ వల్ల భూములు ఇచ్చిన రైతులకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందనే అంశంపై గ్రామ సభల ద్వారా అధికారులు వివరించనున్నారు. అలాగే, రెండో దశలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఆర్డీఏ విజ్ఞప్తి చేసింది.
Read Also: Joe Root Mission 15921: మిషన్ 15921.. జో రూట్ రోడ్ మ్యాప్, 2027లో సచిన్ రికార్డు బ్రేక్!
Also Read
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
అయితే, రెండో దశ భూ సమీకరణలో భాగంగా మొత్తం 3,828.56 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు ఉండగా.. అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లె గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను అధికారులకు అందజేశారు.
Read Also: Russia: వెనిజులాలో ఉద్రిక్తతలు.. యూఎస్ నుంచి చమురు నౌకలను రక్షించడానికి రష్యా జలాంతర్గామి ఎంట్రీ!
ఇక, తుళ్లూరు మండలంలోని వడ్డమానులో 1763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సమీకరణ చేపట్టనుంది. హరిశ్చంద్రాపురంలో 1448.09 ఎకరాల పట్టా, 2.29 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సమీకరణ చేయనున్నారు. పెదపరిమిలో 5886.18 ఎకరాల పట్టా భూమి ఉంది. అలాగే, అమరావతి మండలలోని వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెదమద్దూరులో 1018 ఎకరాల పట్టా భూములు, యండ్రాయ్ గ్రామ పరిధిలో 1879 ఎకరాల పట్టా భూమి, 46 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ భూ సమీకరణ చేయనున్నారు. ఇక, కర్లపూడి లేమల్లే 2603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ను భూ సమీకరణలో చేస్తుంది.
Read Also: Tragedy: తుఫాన్ ను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు యువకులు మృతి.. మరో 9 మందికి గాయాలు
కాగా, మొత్తం 7 గ్రామాల్లో 16,562.52 ఎకరాల పట్టా భూములు, అలాగే 104.01 ఎకరాల అసైన్డ్ భూములు సమీకరించాలని సీఆర్డీఏ కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూమి కలిపి చూస్తే భూ సమీకరణ తర్వాత మొత్తం 20,494 ఎకరాల భూమి అమరావతి అభివృద్ధికి అందుబాటులోకి రానుంది. దీంతో రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం 7 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు సీఆర్డీయే అధికారులు. ఉదయం 10 గంటలకు వడ్డమాను, సాయంత్రం 4 గంటలకు ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!