Amaravati: ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. 20,494 ఎకరాలు సమీకరణ
- ఇవాళ్టి నుంచి ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్..
- పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 7 గ్రామాల్లో భూ సమీకరణ..
- 20,494 ఎకరాలు సమీకరించనున్న ప్రభుత్వం..
- ల్యాండ్ పూలింగ్ పై రైతులకు అవగాహన కల్పించనున్న ప్రభుత్వం..
- రైల్వే స్టేషన్, ఇన్రర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ కోసం భూ సమీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. తొలి రోజు వడ్డమాను, యండ్రాయి గ్రామాల్లో భూ సమీకరణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొంటారు. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి సీఆర్డీఏ (CRDA) అధికారులు నేటి నుంచి రైతులను కలిసి అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. భూ సమీకరణ వల్ల భూములు ఇచ్చిన రైతులకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందనే అంశంపై గ్రామ సభల ద్వారా అధికారులు వివరించనున్నారు. అలాగే, రెండో దశలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఆర్డీఏ విజ్ఞప్తి చేసింది.
Read Also: Joe Root Mission 15921: మిషన్ 15921.. జో రూట్ రోడ్ మ్యాప్, 2027లో సచిన్ రికార్డు బ్రేక్!
Also Read
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
అయితే, రెండో దశ భూ సమీకరణలో భాగంగా మొత్తం 3,828.56 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు ఉండగా.. అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లె గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను అధికారులకు అందజేశారు.
Read Also: Russia: వెనిజులాలో ఉద్రిక్తతలు.. యూఎస్ నుంచి చమురు నౌకలను రక్షించడానికి రష్యా జలాంతర్గామి ఎంట్రీ!
ఇక, తుళ్లూరు మండలంలోని వడ్డమానులో 1763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సమీకరణ చేపట్టనుంది. హరిశ్చంద్రాపురంలో 1448.09 ఎకరాల పట్టా, 2.29 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సమీకరణ చేయనున్నారు. పెదపరిమిలో 5886.18 ఎకరాల పట్టా భూమి ఉంది. అలాగే, అమరావతి మండలలోని వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెదమద్దూరులో 1018 ఎకరాల పట్టా భూములు, యండ్రాయ్ గ్రామ పరిధిలో 1879 ఎకరాల పట్టా భూమి, 46 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ భూ సమీకరణ చేయనున్నారు. ఇక, కర్లపూడి లేమల్లే 2603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ను భూ సమీకరణలో చేస్తుంది.
Read Also: Tragedy: తుఫాన్ ను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు యువకులు మృతి.. మరో 9 మందికి గాయాలు
కాగా, మొత్తం 7 గ్రామాల్లో 16,562.52 ఎకరాల పట్టా భూములు, అలాగే 104.01 ఎకరాల అసైన్డ్ భూములు సమీకరించాలని సీఆర్డీఏ కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూమి కలిపి చూస్తే భూ సమీకరణ తర్వాత మొత్తం 20,494 ఎకరాల భూమి అమరావతి అభివృద్ధికి అందుబాటులోకి రానుంది. దీంతో రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం 7 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు సీఆర్డీయే అధికారులు. ఉదయం 10 గంటలకు వడ్డమాను, సాయంత్రం 4 గంటలకు ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
-
Sharwanand : మళ్ళీ సంక్రాంతిపై కన్నేసిన శర్వా
-
Melodi: ‘‘ఇన్స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్గా మోడీ-మెలోనీ
-
“Aadarsha Kutumbam” కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!