ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC : మహిళల క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా 2026లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ప్రైజ్ మనీని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుండగా.. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్గా నిలవనుంది. ఈసారి మొదటిసారిగా 12 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇంగ్లాండ్ లోని ఏడు వేదికల్లో మొత్తం 33 మ్యాచ్లు నిర్వహించనున్నారు.
విజేతకు రూ.22 కోట్లకుపైగా :
ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. 2026 మహిళల టీ20 ప్రపంచకప్ విజేత జట్టుకు 2.34 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.22 కోట్లకుపైగా) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. రన్నరప్ జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.11 కోట్ల బహుమతి లభించనుంది. అలాగే టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు 247,500 డాలర్లు (రూ.2 కోట్లు) అందజేయనున్నారు. సెమీఫైనల్ దశలో ఓడి నిష్క్రమించే జట్లకు కూడా నిరాశ ఎదురుకాకుండా దాదాపు రూ.6.56 కోట్ల బహుమతి ఇవ్వనున్నారు.
Also Read
- iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
- FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
లీగ్ మ్యాచ్లకూ ప్రత్యేక బోనస్:
నాకౌట్ మ్యాచ్లకే కాకుండా లీగ్ దశలో కూడా జట్లకు ప్రోత్సాహక నగదు బహుమతులు ప్రకటించింది ఐసీసీ. గ్రూప్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన జట్టుకు సుమారు రూ.29 లక్షల బోనస్ అందజేయనుంది. దీంతో ప్రతి మ్యాచ్కు మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టు, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఈసారి తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. టైటిల్ ఫేవరెట్ జట్లలో భారత్ ఒకటి.
మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారి 12 జట్లు పోటీపడుతున్నాయి. గతంలో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, ఈసారి టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూపులు:
గ్రూప్-1: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్.
గ్రూప్-2: ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్.
తాజావార్తలు
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!